విమానాశ్రయంలో శృతిహాసన్ వెంటపడిన ఆ వ్యక్తి ఎవరు?

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (11:40 IST)
Shruthi haasan
టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్‌కు విమానాశ్రయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయంలో ఆమెను ఓ వ్యక్తి అనుసరించాడు. మీ అభిమానినంటూ వెంబడించాడు. ఏకంగా ఎయిర్‌పోర్ట్‌ లోపలి నుంచి కారు ఎక్కే వరకు ఫాలో అయ్యాడు. దీంతో భయపడిన శ్రుతి అతడిని నిలదీయడంతో అక్కడి నుంచి జారుకొన్నాడు. తాజాగా ఈ విషయంపై ఆమె తన ఇన్‌స్టా చిట్‌చాట్‌లో మాట్లాడారు. అతనెవరో తనకు తెలియదని అన్నారు.
 
దీనిపై ఆమె స్పందిస్తూ, 'నేను ఎయిర్‌పోర్ట్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి నా వెంట రావడం గమనించాను. ఫొటో కోసం అనుకున్నాను. అంతలో ఫొటోగ్రాఫర్‌ ఆమె పక్కకు వెళ్లి నిల్చొమని అతడికి చెప్పాడు. వాళ్లిద్దరూ స్నేహితులేమో అనుకున్నా. కానీ, అతడు నాకు చాలా దగ్గరగా రావడంతో అసౌకర్యంగా అనిపించింది. అందుకే వేగంగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాను. వ్యక్తిగత అంగరక్షకులను పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా జీవితాన్ని స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నాను. అందుకే ఇప్పటి వరకూ బాడీ గార్డ్స్‌ను పెట్టుకోలేదు. కానీ, ఇప్పుడు ఈ విషయంపై ఆలోచించాలేమో' అని శ్రుతి హాసన్‌ చెప్పారు. 
 
ఇకపోతే, తన సినిమాల విషయాలపై స్పందిస్తూ, ప్రస్తుతం సలార్ చిత్రంలో నటించానని త్వరలోనే విడుదలకానుందని చెప్పారు. ఆ తర్వాత నాని హీరోగా తెరెక్కుకుతున్న హాయ్ నాన్న చిత్రంలో నటిస్తున్నట్టు ఆమె వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments