Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పొన్నియిన్ సెల్వన్'లో అజిత్ భార్య.. రీ ఎంట్రీ ఖరారేనా?

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (19:04 IST)
Shalini
ప్రముఖ దర్శకుడు మణిరత్నం చోళుల కాలానికి సంబంధించిన కథ ఆధారంగా 'పొన్నియిన్ సెల్వన్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్న 'పొన్నియిన్ సెల్వన్' సినిమా మల్టీస్టారర్‌‌గా అలరించనుంది. రెండు భాగాలుగా విడుదల చేయనున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్‌ పూర్తయినట్టు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. 
 
'పొన్నియిన్ సెల్వన్' మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ప్రభు, ప్రకాష్‌రాజ్, శరత్ కుమార్, పార్తీబన్, ఐశ్వర్యరాయ్, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్‌ అప్‌డేట్‌ నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.
 
భారీ తారాగణంతో తెరకెక్కిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో స్టార్ హీరో అజిత్ భార్య షాలినీ అతిథి పాత్రలో కనిపించనుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. బాలనటిగా పలు సినిమాల్లో నటించిన షాలినీ, మణిరత్నం దర్శకత్వం వహించిన 'సఖి' సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
 
అజిత్‌తో పెండ్లి తరువాత షాలినీ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. మళ్లీ ఇన్ని సంవత్సరాలకు షాలినీ 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో అతిథి పాత్రలో కనిపించనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments