Webdunia - Bharat's app for daily news and videos

Install App

నానిని బండ బూతులు తిట్టిన సాయి పల్లవి... ఎందుకు?

ఫిదా తరువాత సాయిపల్లవి ఒక రేంజ్‌కు పెరిగిపోయింది. కానీ కొత్తకొత్త సినిమాలకు కమిటయ్యే విషయంలో మాత్రం ఇప్పటికీ సాయిపల్లవి జాగ్రత్తగానే వ్యవహరిస్తోంది. రెమ్యునరేషన్ కంటే కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. నిర్మాత దిల్ రాజు సినిమాల్లో నటిస్తే ఆ సినిమా భార

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2017 (19:26 IST)
ఫిదా తరువాత సాయిపల్లవి ఒక రేంజ్‌కు పెరిగిపోయింది. కానీ కొత్తకొత్త సినిమాలకు కమిటయ్యే విషయంలో మాత్రం ఇప్పటికీ సాయిపల్లవి జాగ్రత్తగానే వ్యవహరిస్తోంది. రెమ్యునరేషన్ కంటే కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. నిర్మాత దిల్ రాజు సినిమాల్లో నటిస్తే ఆ సినిమా భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకం సాయి పల్లవిలో చాలా ఎక్కువగా ఉంది. మొదటి సినిమా ఫిదాతో తానేంటో నిరూపించుకుంది సాయి పల్లవి. మొదటి సినిమాతో మంచి సక్సెస్ ఇచ్చిన దిల్ రాజు అడగగానే ఎంసిఎ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది సాయి పల్లవి.
 
ఈ సినిమాలో హీరో నాని. ఇప్పటికే 70 శాతం సినిమా పనులు కూడా పూర్తయ్యాయి. అయితే కొన్ని రోజుల ముందు షూటింగ్ జరుగుతున్న సమయంలో నాని, సాయి పల్లవిల మధ్య చిన్న తగాదా వచ్చిందట. డైలాగ్‌ల విషయంలో నాని అలా చెప్పొద్దు.. ఇలా చెప్పు అని సాయి పల్లవికి చెప్పడంతో ఎలా చెప్పాలో నాకు తెలుసు. నువ్వు చెబితే తెలుసుకునేంత స్థితిలో నేను లేను అందట సాయి పల్లవి. ఒక్క సినిమాకే ఫోజులు బాగా ఎక్కువయ్యాయే.. ఇంకా సినిమాలు తీయాలమ్మా.. అంటూ నాని కూడా బాగానే స్పందించాడట. దీంతో సాయి పల్లవి బూతుల పురాణం మొదలుపెట్టిందట. 
 
సినిమా షూటింగ్ సమయంలో దిల్ రాజు లేకపోవడంతో అది కాస్త పెద్దదై సాయిపల్లవి, నానిలు షూటింగ్ మధ్యలోనే వెళ్ళిపోయారని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. రెండు రోజుల తరువాత దిల్ రాజు స్వయంగా నాని, సాయిపల్లవిలను కలిసి బుజ్జగించారట. కానీ సాయి పల్లవి మాత్రం వెనక్కి తగ్గలేదట. నాని మాత్రం కాస్త వెనక్కి తగ్గి సినిమా షూటింగ్ చేస్తానంటూ ఒప్పుకున్నాడట.

రెండు రోజుల తరువాత పల్లవి కూడా సినిమా షూటింగ్‌లో పాల్గొన్నదట. అయితే వీరి మధ్య ఇప్పటికీ మాటల యుద్థం కొనసాగుతూ ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బయటకు పొక్కనీయొద్దంటూ సినిమా షూటింగ్ యూనిట్ అందరినీ దిల్ రాజు కోరాడని చెప్పుకుంటున్నారు. కానీ ఆ విషయం కాస్తా అలా.. అలా బయటకు వచ్చేసింది. ఇప్పుడు సినీపరిశ్రమలో వీరి గొడవే హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments