''అజ్ఞాతవాసి'' నిర్మాతపై ప్రశంసలు.. డిస్ట్రిబ్యూటర్లను అలా ఆదుకున్నాడట..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ నటించిన చిత్రం అజ్ఞాతవాసి. సంక్రాంతికి ముందు విడులైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది. దీంతో అభిమానులు సైతం నిరాశలో కూరుకుపోయారు. అయితే భా

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (17:15 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ నటించిన చిత్రం అజ్ఞాతవాసి. సంక్రాంతికి ముందు విడులైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది. దీంతో అభిమానులు సైతం నిరాశలో కూరుకుపోయారు. అయితే భారీ మొత్తానికి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొనేశారు.

కానీ ఈ సినిమా విజయవంతం కాకపోవడంతో.. ప్రాంతాల వారీగా తీసుకున్నవారంతా నష్టాల్లో మునిగిపోయారు. ఫలితంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూ.14కోట్ల మేర నష్టపోయినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 
 
ఈ సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదనే ఉద్దేశంతో నిర్మాత రాధాకృష్ణ ప్రయత్నాలు చేపట్టారట. ఆ నష్టాల నుంచి వాళ్లను గట్టెక్కించేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే దిల్ రాజుకు రాధాకృష్ణ రూ.7 కోట్ల వరకు చెల్లించారని టాక్ వస్తోంది. అలాగే మిగిలిన డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఫోన్ కాల్స్ వెళ్లాయని.. వారందరికీ రాధాకృష్ణ కొంత నష్టపరిహారం చెల్లించినట్లు సమాచారం.
 
మరికొంతమందికి తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన కమిట్‌మెంట్లు ఇస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో అజ్ఞాతవాసి నిర్మాత తీసుకున్న నిర్ణయం పట్ల డిస్ట్రిబ్యూటర్లు హర్షం వ్యక్తం చేయడంతో పాటు రాధాకృష్ణను అభినందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

టీడీపీలో మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు, విడాకులు జరగవు.. నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తాం.. సీఎం చంద్రబాబు

Woman: దిండుక్కల్‌‍లో ఘోరం.. బస్సు నుంచి కిందపడిన మహిళ మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments