రియా చక్రవర్తి ఫ్యామిలీ మిస్సింగ్... అర్థరాత్రి సూట్‌కేసులతో జంప్???

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (07:53 IST)
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ సినీ నటి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులు కనిపించడం లేదు. సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణలో భాగంగా, రియా చక్రవర్తి ఇంటికి బీహార్ పోలీసులు వెళ్ళగా ఈ విషయం బయటపడింది. నాలుగు రోజుల క్రితం పెద్ద పెద్ద సూట్‌కేసులను వెంటతీసుకుని అర్థరాత్రి పూట కారులో వెళ్లినట్టు ఓ జాతీయ చానెల్ చెబుతోంది. 
 
కాగా, సుశాంత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కేసులో రియా గురించి రోజుకో విషయం వెలుగు చూస్తోంది. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రూ.15 కోట్లు రియా ఓ అజ్ఞాత ఖాతాకు బదిలీ చేసిందని సుశాంత్ తండ్రి బీహార్ పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. సుశాంత్ తండ్రి ఫిర్యాదుతో ముంబైలోని రియా చక్రవర్తి ఇంటికి విచారణ నిమిత్తం బీహార్ పోలీసు బృందం వెళ్లింది. అయితే.. అప్పటికే ఆమె ఇంటి నుంచి అదృశ్యమైంది.
 
ఓ జాతీయ టీవీ ఛానల్ రియా ఇల్లు సూపర్‌వైజర్‌ను ఈ విషయమై సంప్రదించగా షాకింగ్ విషయం బయటికొచ్చింది. మూడు రోజుల క్రితం రియా అర్థరాత్రి తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు. బ్లూ కలర్ కారులో వెళ్ళారని, పెద్దపెద్ద సూట్‌కేసులను వెంట తీసుకెళ్లారని తెలిపాడు. రియా ఉంటున్న ఈ ఇంటికి సుశాంత్ ఒకప్పుడు వచ్చాడని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు

హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు : ఉదయనిధి స్టాలిన్

మాట నిలబెట్టుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం - డీఏ విడుదల చేసిన సర్కారు

ఇద్దరు పిల్లల తల్లి... భర్త మేనల్లుడితో అక్రమ సంబంధం... ఇక వద్దని చెప్పడంతో...

దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు లగ్జరీ కార్లు బహుకరించిన యజమాని.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments