Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బిగ్‌బాస్' స్థానంలో రియాలిటీ డాన్స్ షో... న్యాయ నిర్ణేతలుగా 'ఆ ముగ్గురు'

హీరో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగులో ప్రసారమవుతున్న 'బిగ్‌బాస్' రియాల్టీ షో మరో వారం రోజుల్లో ముగియనుంది. ఈ షో స్థానంలో మరో రియాల్టీ షోను ప్రసారం చేసేందుకు 'స్టార్ మా' యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (12:26 IST)
హీరో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగులో ప్రసారమవుతున్న 'బిగ్‌బాస్' రియాల్టీ షో మరో వారం రోజుల్లో ముగియనుంది. ఈ షో స్థానంలో మరో రియాల్టీ షోను ప్రసారం చేసేందుకు 'స్టార్ మా' యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అదేసమయంలో ఈ రియాల్టీ షో కోసం హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ను ప్రధాన న్యాయ నిర్ణేతగా ఎంపిక చేసిన విషయం తెల్సిందే. ఇపుడు మరో ఇద్దరిని ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
 
వీరిలో ఒకరు జానీ మాస్టర్ కాగా, మరొకరు హీరోయిన్ ఆదాశర్మ. అయితే, జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇక ఆదా శర్మ విషయానికి వస్తే.. ఈమె టాలీవుడ్ హీరోయిన్‌ అని మాత్రమే ఆమెను ఎంపిక చేయలేదట. ఈమెకు కథక్ నృత్యంలోనూ.. వెస్ట్రన్ డాన్సుల్లోను ఆమెకి మంచి నైపుణ్యం ఉందట.
 
ఈ కారణంగానే ఆమెను తీసుకోవడం జరిగిందని చెబుతున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రోమోలను త్వరలోనే రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ రియాల్టీ షోను స్టార్ ప్లస్‌లో ప్రసారమవుతున్న "నాచ్ బలియే" తరహాలోనే ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments