అది నేర్చుకోవడంలో నేను నిత్యవిద్యార్థినే అంటున్న రాశీ ఖన్నా

Webdunia
గురువారం, 28 మే 2020 (17:43 IST)
రాశీఖన్నా విద్యార్థి అవతారమెత్తడమేంటి.. సినిమాలో విద్యార్థిగా నటిస్తోంది.. ఇప్పుడు షూటింగ్‌లు లేవు కదా. రాశీ ఖన్నా ఉన్నట్లుండి విద్యార్థినిగా మారిపోవడం ఏంటని అందరూ అనుకుంటున్నారు కదా. అదేమీ లేదండి.. లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉండడం ఇష్టం లేని రాశీ ఖన్నా తమిళం నేర్చుకుంటోందట.
 
తెలుగులో కాదు తమిళంలోను రాశీకి మంచి ఆఫర్లే వస్తున్నాయట. దీంతో రాశీ ఖన్నా తమిళం నేర్చుకోవాలని లాక్ డౌన్ ముందే అనుకున్నదట. షూటింగ్ చేస్తూనే తమిళం నేర్చుకోవడానికి గంట సమయం కేటాయించాలని నిర్ణయించుకుందట. అయితే ఉన్నట్లుండి లాక్ డౌన్ రావడం.. షూటింగ్‌లు ఆగిపోవడం జరిగిపోయాయి. 
 
ఇది కాస్త రాశీ ఖన్నాకు బాగా కలిసొచ్చింది. అందుకే రాశీ ఖన్నా తమిళంలో తన గురువు మిస్ లీలతో ఆన్ లైన్లో క్లాస్‌లు నేర్చుకుంటోందట. తాను విద్యార్థిని అయిపోయానంటూ ల్యాప్ టాప్ చేతిలో పట్టుకుని ఒక ఫోటోకు ఫోజిచ్చి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది అమ్మడు. ఆ ఫోటోకు కాస్త అభిమానులు తెగ సందేశాలను పంపించేస్తున్నారట.
 
చిన్నప్పుడు ఎప్పుడో స్కూలుకు వెళ్ళి చదువుకున్నాను. మళ్ళీ ఇప్పుడు విద్యార్థినిగా మారిపోయి చదువుకుంటున్నాను. నేను నిత్యవిద్యార్థిని అంటూ పోస్ట్ చేసిందట రాశీ ఖన్నా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోటిన్నర మొబైల్ నంబర్లు బ్లాక్.. అందులో మీ నంబర్ వుందా?

400 మీటర్ల దూరానికి రూ.18 వేలు వసూలు.. ఎక్కడ?

ఈ డ్రెస్సులో నువ్వు కోతిలా వున్నావన్న భర్త, ఆత్మహత్య చేసుకున్న భార్య

సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించాలి : సీఎం చంద్రబాబు

మీ అక్కను చంపేస్తున్నా.. రికార్డు చేసిపెట్టుకో.. పోలీసులకు ఆధారంగా ఉంటుంది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం

వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?

సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్

వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments