Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెటిఆర్‌ను కలిసిన రకుల్‌ప్రీత్ సింగ్.. ఎందుకు..?

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (21:08 IST)
హీరోయిన్లను హీరోలు కలవడం మామూలే. వారి మధ్య గాసిప్స్ చోటుచేసుకోవడం షరా మామూలే. అయితే రాజకీయ నాయకుడిని టాప్ హీరోయిన్ కలిస్తే ఏదో జరుగుతుందని అనుకోవాలి. ఆ హీరోయిన్ రాజకీయాల్లోకి వెళ్ళడమో లేకుంటే వేరే ఇతరత్రా పనులు ఏమైనా ఉన్నాయో అన్న కోణంలో చూడాల్సి ఉంటుంది.
 
అలాంటి పరిస్థితే తెలంగాణా మంత్రి కెటిఆర్.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మధ్య ఏర్పడింది. రెండురోజుల క్రితం హైదరాబాద్ లోని ఒక ప్రముఖమైన హోటల్లో వీరిద్దరు రహస్యంగా కలిశారట. ఈ రహస్య కలయికకు అసలు కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలతో తెలంగాణా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ప్రభుత్వ పథకాలు మరింతగా ప్రజలకు తెలియాలంటే ఖచ్చితంగా ప్రచారకర్త అవసరం. అది కూడా అందమైన హీరోయిన్ అయితే బాగుంటుందన్నది ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్దేశమట.
 
అందుకే కెటిఆర్‌కు ఆ బాధ్యతలను కెసిఆర్ అప్పగించారట. దీంతో కెటిఆర్ హీరోయిన్ల కోసం వెతుకుతున్న నేపథ్యంలో విషయం తెలుసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ అవకాశం కోసం కెటిఆర్‌ను కలవడానికి సిద్ధమైందట. ఆ క్రమంలో ఆమె కేటీఆర్‌ను కలిసి బ్రాండ్ అంబాసిడర్‌గా తను వ్యవహరిస్తానని చెప్పిందని, ఈ మేరకు ఆయనతో 10 నిమిషాలు మాత్రమే చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments