Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాలకు తలైవా గుడ్ బై.. ఎందుకు..?

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (10:19 IST)
కోలీవుడ్లో రజినీకాంత్‌పై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. రజినీకాంత్ అటు రాజకీయాల్లోకి వెళ్ళేందుకు సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రజినీకాంత్ ఒక నిర్ణయం తీసేసుకున్నారట. వచ్చే సంవత్సరం నుంచి సినిమాల్లో నటించకూడదని, సినిమాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చేశారట. అందుకే 2.0 సినిమాను ఈ నెలలో 29వ తేదీన రిలీజ్ అయ్యే విధంగా దర్శకుడు శంకర్‌ని తొందరపెట్టారట. 
 
అంతేకాదు సిమ్రాన్‌తో కలిసి రజినీకాంత్ పేట్ట అనే సినిమాను పూర్తి చేశాడు. షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. పేట్ట సినిమా జనవరి 24వ తేదీన విడుదలవుతోంది. 40 రోజుల వ్యవధిలోనే రజినీ రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. తక్కువ సమయంలోనే రెండు సినిమాలను రిలీజ్ చేయడానికి రజినీకాంత్ సిద్ధమవుతుండటంతో అభిమానుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
 
గత కొంతకాలంగా రజినీకాంత్ సినిమాలు పెద్దగా ఆడలేదు. కబాలి, కాల సినిమాలు పెద్దగా ఆడలేదు. అలాంటి సమయంలో 2.0 సినిమా విడుదలవుతోంది. సినిమా హైప్‌కు తగ్గట్టుగానే విజయం వరిస్తుందనేది రజినీకాంత్ ఆలోచన. అందుకే సినిమా విజయవంతమై సక్సెస్ హీరోగా మళ్లీ పుంజుకుని సినిమాలకు దూరమైపోవాలన్నది రజినీ ఆలోచన. అంతేకాదు ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్ళి ప్రజా సేవ చేయాలన్న నిర్ణయంలో ఉన్నారట రజినీ. మరి చూడాలి రజినీ తీసుకుంటున్న నిర్ణయానికి అభిమానులు ఎంతవరకు సపోర్ట్ చేస్తారో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments