Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్-మహేష్ బాబుతో రాజమౌళి భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ?

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ సంపాదించిన దర్శకధీరుడు రాజమౌళి తదుపరి ప్రాజెక్టు ఏంటా? అనే దానిపై ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చసాగుతోంది. రాజమౌళి బాహుబలి తర్వాత బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్త

Webdunia
శనివారం, 15 జులై 2017 (17:19 IST)
బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ సంపాదించిన దర్శకధీరుడు రాజమౌళి తదుపరి ప్రాజెక్టు ఏంటా? అనే దానిపై ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చసాగుతోంది. రాజమౌళి బాహుబలి తర్వాత బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తారని.. తెలుగులో ఎన్టీఆర్-మహేష్ బాబు కాంబినేషన్లో మరో మల్టీస్టారర్ చేసే ఛాన్స్ ఉందనే వార్త వినిపిస్తోంది. అయితే ఈ వార్తలో నిజం లేదనే వార్త కూడా వినిపిస్తోంది. 
 
రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం కథను పూర్తిచేసే పనిలో విజయేంద్ర ప్రసాద్ ఉన్నారట. కథ పూర్తి కాగానే నటీనటుల ఎంపిక మొదలవుతుందని సమాచారం.
 
ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకుంటున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ప్రకటించారు. దీంతో రాజమౌళి తదుపరి చిత్రం ఎన్టీఆర్‌తోనే ఉంటుందని.. అయితే మహేష్ బాబు కూడా ఆ సినిమాలోనే వుంటారని టాక్. ఎన్టీఆర్, మహేశ్‌బాబుతో రాజమౌళి మల్టీస్టారర్‌గా భారీ బడ్జెట్‌తో సినిమా తీయబోతున్నారని.. ఈ సినిమా కూడా బంపర్ హిట్ కావడం ఖాయమని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments