Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్.. ఏంటి ఈ కన్ఫ్యూజన్?

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (12:09 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాథేశ్యామ్ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఇటలీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. ఆదిపురుష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాథేశ్యామ్ ఇటలీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ప్రబాస్ ముంబాయిలో వాలిపోయాడు. ఆదిపురుష్ డైరెక్టర్ ఓంరౌత్‌తో చర్చలు జరిపిన తర్వాత ఈ మూవీకి ఆరు నెలలు డేట్స్ ఇచ్చేందుకు ఓకే చెప్పాడని తెలిసింది.
 
ప్రభాస్‌తో ఫోటో షూట్ కూడా చేసారని సమాచారం. అయితే... ఆదిపురుష్ మూవీని 2022 ఆగష్టు 11న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే... ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాథేశ్యామ్ మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించలేదు కానీ.. ఇంకా స్టార్ట్ చేయని ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించడం ఏంటి అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారట.
 
అంతేకాకుండా... రాథేశ్యామ్ రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ ఇవ్వాలని ప్రభాస్ పైన ఒత్తిడి పెంచుతున్నారని సమాచారం. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో పాన్ వరల్డ్ మూవీని ప్రకటించారు. ఈ సినిమాని త్వరలోనే స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో అమితాబ్, దీపికా పడుకునే నటిస్తున్నారు.
 
ఇప్పుడు ఆదిపురుష్ రిలీజ్ డేట్ ప్రకటించడంతో ఈ సినిమా పరిస్థితి ఏంటి..? అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తారో..? రిలీజ్ ఎప్పుడు ఉంటుందో..? అనేది కన్ఫ్యూజన్‌గా ఉంది అంటున్నారు. మరి... ప్రభాస్ త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments