ప్రభాస్ నిర్ణయంతో ఆలోచనలో పడ్డ నాగ్

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (18:54 IST)
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ రాథేశ్యామ్ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడా..? అని ఎదురు చూస్తే.. మహానటి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నాగ్ అశ్విన్‌తో సినిమాని ఎనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. అది కూడా ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కాకుండా.. పాన్ వరల్డ్ అంటూ ఎనౌన్స్ చేసి సంచలనం సృష్టించారు. ఎప్పుడెప్పుడు సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని ఎదురు చూస్తుంటే... ప్రభాస్ ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లకుండానే.. బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ ఎనౌన్స్ చేసి మరోసారి సర్ఫ్రైజ్ చేసాడు.
 
అయితే ఆదిపురుష్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి నాగ్ అశ్విన్ ఆలోచనలో పడ్డాడట. ఎందుకంటే.. రాథేశ్యామ్ పూర్తవ్వాలి. ఆ తర్వాత నాగ్ అశ్విన్‌తో సినిమా స్టార్ట్ చేస్తాడా..? ఆదిపురుష్ స్టార్ట్ చేస్తాడా..? అనేది ఆసక్తిగా మారింది. దీంతో నాగ్ అశ్విన్ తెగ టెన్షన్ పడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆయన దగ్గర కొన్ని కాన్సెప్ట్ బేస్డ్ కథలు వున్నాయట.
 
అందుచేత ఈ గ్యాప్‌లో ఓ చిన్న కథతో సినిమా చేద్దామా... ప్రభాస్ డేట్స్ ఇచ్చేవరకు ఆగుదామా..? అని ఆలోచిస్తున్నాడని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ రాథేశ్యామ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఆదిపురుష్‌, నాగ్ అశ్విన్‌తో మూవీ రెండూ ఒకేసారి చేయాలనుకుంటున్నాడని తెలిసింది. అందుచేత నాగ్ అశ్విన్ ఈ గ్యాప్‌లో చిన్న సినిమా చేయకుండా ప్రభాస్ కోసమే వెయిట్ చేయాలని డిసైడ్ అయ్యాడని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. తెలంగాణకు గోదావరి జలాలు

హలో నెతన్యాహు జీ... మా పౌరులను భద్రంగా చూసుకోండి : ప్రధాని మోడీ

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మోదీ చర్చలు

ఆంధ్రప్రదేశ్‌ను తెలుగునాడుగా పేరు మార్చాలి.. గరికపాటి నరసింహారావు

ఇరాన్ కొత్త నాయకత్వంతో చర్చలకు నేను సిద్ధంగా వున్నాను.. డొనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తులసి రసంతో తేనెను కలిపి తీసుకుంటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments