Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా రేటు రూ.2 కోట్లు? ఎవరు ముందొస్తే వారికే ఫస్ట్ ఛాన్సంటున్న జిగేల్ రాణి

Webdunia
బుధవారం, 29 జులై 2020 (14:34 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ ముహూర్తాన పాదం మోపిందోగానీ పూజా హెగ్డే దశ తిరిగిపోయింది. ఒక వైపు హీరోయిన్ పాత్రలతో పాటు... మరోవైపు ఐటమ్ సాంగులతో రెచ్చిపోతోంది. స్పష్టంగా చెప్పాలంటే... ఆమె ఇప్పటివరకు నటించిన చిత్రాలన్నీ ఒక ఎత్తు అయితే రాంచరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన "రంగస్థలం" చిత్రంలోని ఐటమ్ సాంగ్ మరో ఎత్తు. ఈ పాటలో పూజా హెగ్డే ఇరగదీసింది. 
 
ఆ తర్వాత ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వచ్చాయి. ప్రిన్స్ మహేష్ బాబుతో 'మహర్షి', తాజాగా అల్లు అర్జున్‌తో 'అల వైకుంఠపురములో' చిత్రాలు చేసింది. ఈ రెండు చిత్రాలు బ్లాక్‌బస్టర్ మూవీలు. దీంతో ఈ అమ్మడు ఫేట్ మారిపోయింది. ముఖ్యంగా తన పారితోషికాన్ని ఒక్కసారిగా ఆకాశానికి పెంచేసింది. ఈ అమ్మడు రెమ్యునరేషన్‌ను భారీ చిత్రాల నిర్మాతలు మాత్రమే భరించే స్థితిలో వున్నారు. 
 
పైగా, పూజాకు తెలుగుతో పాటు హిందీలో కూడా మార్కెట్ ఉండడంతో ఆమె డేట్స్ దొరకడం గగనంగా మారిపోయింది. ఆ మధ్య వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రానికి ముందు పూజ కోటి రూపాయల వరకుతీసుకునేది. ఆ సినిమాకు రూ.1.4 కోట్ల వరకు తీసుకుందని వినికిడి. 
 
ఇక ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు తన పారితోషికాన్ని ఒక్కసారిగా రెండు కోట్లకు పెంచేసిందట. ఈ రేటు విషయంలో నో కాంప్రమైజ్ అంటోంది. అయినప్పటికీ, ఆమెకున్న క్రేజ్‌ను బట్టి పూజను బుక్ చేయడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు మరి! 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments