Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు చిత్రంలో గెస్ట్ రోల్‌లో నమ్రతా శిరోద్కర్!

''బ్రహ్మోత్సవం'' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2016 (10:43 IST)
''బ్రహ్మోత్సవం'' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు ఎస్.జే.సూర్య నెగెటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈయనకు జోడిగా నదియా నటిస్తుంది. మహేష్, మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
కాగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా ఈ సినిమాలో నటిస్తోందట. ఆమె ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలు నటించలేదు. ఇప్పుడు మళ్లీ నమ్రత సినిమాల్లో నటిస్తుందనే వార్తలు రావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొంతకాలం వేచియుండాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

మనుషుల ప్రాణాలు హరిస్తున్న వైఎస్. జగన్ వాహన శ్రేణి!!

Raja murder fallout: రాజా రఘువంశీ హత్య: పర్యాటకుల వివరాలు తప్పనిసరి.. మేఘాలయ

ఎయిరిండియా విమాన ప్రమాదానికి కుడివైపు ఇంజినే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments