Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకి ముహూర్తం ఫిక్స్

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (18:42 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ ను వచ్చే నెల నుంచి స్టార్ట్ చేయనున్నారు. రామ్ చరణ్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. చిరు, చరణ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే... ఆచార్య తర్వాత చిరంజీవి వినాయక్‌తో లూసీఫర్ రీమేక్, మెహర్ రమేష్‌తో వేదాళం రీమేక్ చేయనున్నారు. అయితే.. ఆచార్య తర్వాత వెంటనే ఏ సినిమా చేస్తారనేది సస్పెన్స్‌గానే ఉండేది. 
 
అయితే.. తాజా వార్త ఏంటంటే... ముందుగా డైనమిక్ డైరెక్టర్ వినాయక్‌తో లూసీఫర్ రీమేక్ చేస్తారనుకున్నారు కానీ... మెహర్ రమేష్‌తో వేదాళం రీమేక్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం.
 
ఈ సినిమా స్టార్ట్ చేయడానికి ముహుర్తం కూడా ఫిక్స్ చేసారట. ఇంతకీ ఎప్పుడంటారా..? దసరాకి ఈ సినిమా ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది. చిరంజీవి ఎప్పుడంటే అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి మెహర్ రమేష్ రెడీగా ఉన్నాడని టాక్. ఈ సినిమా తర్వాత వినాయక్‌తో లూసీఫర్ రీమేక్‌ను ఫిబ్రవరిలో ప్రారంభించాలి అనుకుంటున్నారు.
 
ఆ తర్వాతే బాబీతో సినిమా ఉంటుంది. ఈ లెక్కన బాబీ చిరంజీవితో సినిమా చేయటానికి చాలా టైమ్ పడుతుంది. ఈలోపు బాబీ వేరే సినిమా చేస్తాడో.. అప్పటివరకు వెయిట్ చేస్తాడో..?

సంబంధిత వార్తలు

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

ఏపీలో పోలింగ్ తర్వాత తిరుమలకు రేవంత్ రెడ్డి

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

తర్వాతి కథనం
Show comments