Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళ వెండితెరపై "జీన్స్" కాంబినేషన్ రిపీట్??

Advertiesment
Jeens Combination
, బుధవారం, 14 అక్టోబరు 2020 (18:17 IST)
తమిళ హీరో ప్రశాంత్ - బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ నటించిన చిత్రం జీన్స్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సుమారు రెండు దశాబ్దాల క్రితం వచ్చింది. ఈ చిత్రం అప్పట్లో సరికొత్త రికార్డులను నెలెకొల్పింది. మంచి వినోదాన్ని ఇస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీజంట మరో సినిమాలో కనువిందు చేసే అవకాశం కనిపిస్తోంది.
 
హిందీలో వచ్చిన 'అంధాదున్' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. సీనియర్ హీరో ప్రశాంత్ ఇందులో కథానాయకుడుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో నెగటివ్ టచ్‌తో కూడిన ఓ కీలక పాత్ర వుంది. హిందీలో సీనియర్ నటి టబు ఆ పాత్రను పోషించింది. ఇప్పుడు తమిళంలో ఈ పాత్రకు గానూ ఐశ్వర్య రాయ్‌ని సంప్రదిస్తున్నారట.
 
ఈ విషయంలో ప్రస్తుతం ఐశ్వర్యతో సంప్రదింపులు జరుపుతున్నామని, అయితే, ఆమె నుంచి ఇంకా నిర్ణయం రాలేదనీ చిత్ర నిర్మాత, ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ చెప్పారు. ఐశ్వర్య అయితే ఆ పాత్రకు బాగా సూటవుతుందని, సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని ఆయన నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. 
 
ఇదిలావుంచితే, తెలుగులో ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. నితిన్, నభా నటేష్ జంటగా నటిస్తున్న ఈ తెలుగు వెర్షన్లో ఆ కీలక పాత్రను తమన్నా పోషిస్తోంది. త్వరలోనే ఈ తెలుగు వెర్షన్ షూటింగ్ మొదలవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శోభానాయుడు లాంటి గొప్ప కూచిపూడి కళాకారిణి లేని లోటు ఎవరూ తీర్చలేనిది: మెగాస్టార్ చిరంజీవి