Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీకి జోడీగా శ్రీదేవి కుమార్తె???

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (19:33 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కరోనా వైరస్ కారణంగా ఆగిపోయింది. అయితే, త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను నిర్మించనున్నారు. 
 
దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అవినీతి కార్యకలాపాలపై దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. ఇందులో చిరంజీవి దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపిస్తారట. 
 
ఇక ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ఓ పురాతనమైన దేవాలయం సెట్‌ను వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు.
 
ఇక చిరంజీవి సరసన ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రెజీనా ఓ ఐటం పాటలో కనిపిస్తుంది. అయితే, ఈ చిత్రంలో మరో కథానాయికగా దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించే చాన్స్ వుందని టాలీవుడ్‌లో తాజాగా ప్రచారం జరుగుతోంది. 
 
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో గెస్ట్ పాత్రలాంటి కీలక పాత్రలో రామ్ చరణ్ నటించనున్నాడు. ఆయన సరసన నటించడానికి ఇప్పటికే తమన్నాను మాట్లాడివుంచారు. 
 
అయితే, ఆమెకు డేట్స్ సమస్య వస్తుండడంతో మరో హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో జాన్వీ అయితే ఫ్రెష్‌గా ఉంటుందన్న భావనతో చరణ్ ఆమె కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments