Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌ బాబు మూడు భారీ చిత్రాలు ఫిక్స్

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (23:38 IST)
సూపర్ స్టార్ మహేష్‌ బాబు, పరశురామ్‌తో సినిమా చేయనున్నారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. మే 31న ఈ సినిమాని గ్రాండ్‌గా ప్రారంభించనున్నారని సమాచారం. మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ సినిమాలో మహేష్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు కానీ.. బాలీవుడ్ హీరోయిన్ నటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. 
 
ఇదిలా ఉంటే... రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్‌ బాబుతో సినిమా అని ఎనౌన్స్ చేయడం ఆసక్తిగా మారింది. అయితే.. మహేష్ - రాజమౌళి సినిమా దాదాపు రెండేళ్ల తరువాత ఆ  సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చని చెప్పుకుంటున్నారు. అప్పటి వరకూ మహేష్‌ బాబు మరో సినిమా చేయడేమోనని అభిమానులు నిరాశకి లోనయ్యారు కానీ... మహేష్‌ బాబు గ్యాప్ రాకుండా చూసుకుంటున్నాడని తెలిసింది. 
 
రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ముందే పరశురామ్ సినిమా విడుదలైపోతుంది. రాజమౌళి సినిమాలో తన పోర్షన్ షూటింగు మొదలయ్యేసరికి అనిల్ రావిపూడి సినిమాను కూడా మహేష్‌ బాబు పూర్తి చేసే ఆలోచనలో వున్నాడు అంటున్నారు. ఈ ఏడాదిలో పరశురామ్ సినిమాను.. వచ్చే ఏడాదిలో అనిల్ రావిపూడి మూవీని .. 2022లో రాజమౌళి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లానింగ్‌తో మహేష్‌ బాబు వున్నాడని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ఇదే మహేష్‌ మూడు సినిమా ప్లానింగ్ అంటూ ప్రచారం జరుగుతుంది. మరి.. నిజంగా ఇదేనా..? మధ్యలో ప్లాన్ మారుతుందా అనేది చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

మహిళతో అర్థనగ్నంగా ప్రవర్తించిన ఎంఎన్‌ఎస్ నేత కుమారుడు

Weather alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments