Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జై లవ కుశ' కంటే 'స్పైడర్'కే భారీ కలెక్షన్లు...

గత నెలలో దసరా పండుగ సందర్భంగా కేవలం వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సూపర్ స్టార్ల చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ ఒకటికాగా, మరొకటి ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా వచ్చిన స్

Webdunia
ఆదివారం, 1 అక్టోబరు 2017 (12:56 IST)
గత నెలలో దసరా పండుగ సందర్భంగా కేవలం వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సూపర్ స్టార్ల చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ ఒకటికాగా, మరొకటి ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా వచ్చిన స్పైడర్. ఈ రెండు చిత్రాలు కేవలం వారం రోజుల వ్యవధిలో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. 
 
బాబీ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్ నిర్మాతగా జూనియర్ ఎన్‌టిఆర్ నటించిన సినిమాపై ముందు నుంచీ అభిమానులకు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా కూడా ఉందని అభిమానులు భావించారు. ప్రపంచవ్యాప్తంగా 'జై లవ కుశ' భారీగా కలెక్షన్లు సాధించిందని ఆ సినిమా యూనిట్ తెలిసింది.
 
ఆ తర్వాత రిలీజైన్ "స్పైడర్" సినిమా కూడా భారీ అంచనాలే పెట్టుకున్నారు. వరుస విజయాల డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్.. మహేష్‌ బాబు నటించిన సినిమా కావడంతో సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించడం ఖాయమనుకున్నారు. కానీ సినిమా కాస్త యావరేజ్‌గా మారిపోయింది. అయితే కలెక్షన్లు మాత్రం తగ్గలేదు. "జై లవ కుశ''ను మించేసింది. కేవలం మూడురోజుల్లోనే 'జై లవ కుశ'కు రూ.50 కోట్లు కలెక్షన్లు రాగా 'స్పైడర్' సినిమాకు రూ.52 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటికీ ఈ రెండు సినిమాల్లో 'స్పైడర్'‌కే కలెక్షన్ల వర్షం కురుస్తున్నాయట.

సంబంధిత వార్తలు

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments