Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు నోట 'సర్కారు వారి పాట'

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (12:00 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చివరగా నటించిన చిత్రం "సరిలేరు నీకెవ్వరు". గత సంక్రాంతికి విడుదలై సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తే, రష్మిక మందన్నా హీరోయిన్. తమన్నా భాటియా ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ప్రకాష్ రాజ్ విలన్‌గా నటించగా, లేడీ అమితాబ్ విజయశాంతి ప్రత్యేక పాత్రలో ఆలరించింది. 
 
ఆ తర్వాత మహేష్ బాబు ఎలాంటి మూవీకి కమిట్ కాలేదు. కానీ, "గీత గోవిందం" చిత్ర దర్శకుడు పరశురామ్‌తో కలిసి ఓ ప్రాజెక్టును తీయనున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో కూడా పరశురామ్ కూడా ఆ వార్తలను ధ్రువీకరించాడు. 
 
అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజైన మే 31వ తేదీన వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. అదేరోజు లాంఛనంగా సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తారని తొలుత  భావించారు. కానీ, కరోనా వైరస్ నేపథ్యంలో ఇది వీలుపడుతుందా లేదా అన్నది సందేహంగా మారింది. 
 
మరోవైపు, ఈ సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్ అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు 'సర్కారు వారి పాట' అనే టైటిల్ బాగుంటుందని అనుకుంటున్నారట. ఈ సినిమా పరశురామ్ స్టైల్లో పూర్తి ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందట. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నాడట. మిగిలిన వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments