Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేశ్ చెప్పులు పట్టుకున్నా లేదు... బ్రహ్మోత్సవం బోల్తా... పీవీపి 50% ఆఫర్... అవునా...?

శ్రీమంతుడు చిత్రంతో టాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసిన మహేష్ బాబు... తాజాగా నటించిన బ్రహ్మోత్సవం మొదటిరోజే డబ్బా చిత్రం అంటూ ప్రేక్షకులు నొసలు చిట్లించారు. కనీసం నాలుగైదు వారాలైనా గట్టిగా ఆడుతుందనుకున్నా ఆ దాఖలాలు కనిపించడంలేదు. వేసవి శెలవుల్లో విడుదలయ

Webdunia
సోమవారం, 23 మే 2016 (14:55 IST)
శ్రీమంతుడు చిత్రంతో టాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసిన మహేష్ బాబు... తాజాగా నటించిన బ్రహ్మోత్సవం మొదటిరోజే డబ్బా చిత్రం అంటూ ప్రేక్షకులు నొసలు చిట్లించారు. కనీసం నాలుగైదు వారాలైనా గట్టిగా ఆడుతుందనుకున్నా ఆ దాఖలాలు కనిపించడంలేదు. వేసవి శెలవుల్లో విడుదలయిన ఈ బ్రహ్మోత్సం చిత్రానికి బ్రహ్మాండంగా కలెక్షన్లు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితి అలా లేదని రెండో రోజుకే తేలిపోయింది. 
 
ఇంటర్వెల్ బ్యాంగ్ వరకూ ఏదో అలా లాక్కెళ్లిన అడ్డాల... ఆ తర్వాత మాత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు. హీరోను పనిపాటలేకుండా ఎటెటో తిప్పేశాడు. కాశ్మీరు, నాగ్ పూర్, హరిద్వార్.... ఇలా పుణ్యక్షేత్రాలను తీసుకెళ్లాడు. కానీ అది సినిమా అనే మాట మరిచినట్లున్నాడనే ఘాటు వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద ఈ చిత్రంలో మహేష్ బాబుతో చెప్పులు పట్టుకునే సన్నివేశం పబ్లిసిటీకి బాగా పనికివచ్చిందేమో కానీ ఈ చిత్రాన్ని తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు చెప్పులు లేనివారుగా మారిపోయారనే వార్తలు వస్తున్నాయి. 
 
చిత్రాన్ని ఫ్యాన్సీ రేటుకు కొన్నవారంతా ఇపుడేం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నారట. విషయం తెలుసుకున్న చిత్ర నిర్మాత పొట్లూరి... డిస్ట్రిబ్యూటర్లను తనవంతు ఆదుకుంటానని వర్తమానం ఇచ్చచినట్లు చెప్పుకుంటున్నారు. 50 శాతం మేర నష్టాన్ని పూడ్చుతానని చెప్పినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురం: ఏలేరు సుద్దగడ్డ వద్ద బ్రిడ్జి నిర్మాణం.. పవన్‌ను దేవుడంటున్న ప్రజలు (video)

స్నేహితుడని ఇంటికి పిలిస్తే భార్యను లోబరుచుకున్నాడు.. చివరకు భర్త చేతిలో...

తరగతి గదిలోనే సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకున్న విద్యార్థిని... ఎక్కడ?

మైనర్ బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం.. ప్రిన్సిపాల్ సలహాతో..?

రైల్వే ట్రాక్‌లపై సెల్ఫీ, గ్రూప్ ఫోటోలు.. 24 ఏళ్ల వ్యక్తి రైలు ఢీకొని మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments