Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌కి సీక్రెట్‌గా కథ చెప్పిన డైరెక్టర్ ఎవరు..?

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (22:07 IST)
సూపర్ స్టార్ మహేష్‌ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ "సర్కారు వారి పాట". 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. అయితే... ఈ సినిమా తర్వాత మహేష్‌ చేయనున్న సినిమా ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే... 'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి మహేష్‌తో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. కానీ.. ఈ సినిమా స్టార్ట్ కావడానికి టైమ్ పడుతుంది.
 
అందుచేత రాజమౌళితో చేయనున్న మూవీ కన్నా ముందు మరో సినిమా చేయాలనుకుంటున్నారు. అందుకనే మహేష్ ఇప్పుడు కథలు వింటున్నారని టాక్. రీసెంట్‌గా సీక్రెట్‌గా ఓ కథ విన్నారట. ఇంతకీ మహేష్‌‌కి సీక్రెట్‌గా కథ చెప్పిన డైరెక్టర్ ఎవరంటే... అనిల్ రావిపూడి అని సమాచారం. 
 
'సరిలేరు నీకెవ్వరు' సినిమా తర్వాత మహేష్‌ - అనిల్ కలిసి మరో సినిమా చేయాలనుకున్నారు. అయితే.. కాస్త టైమ్ తీసుకుని సినిమా చేయాలనుకున్నారు. లాక్డౌన్ టైమ్‌లో టైమ్ దొరకడంతో అనిల్ కథ రెడీ చేసాడట. అనిల్ చెప్పిన కథకు మహేష్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. మరి.. ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో..? ఎవరు నిర్మిస్తారో క్లారిటీ రావాలంటే కొంత కాలం ఆగాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న (video)

Bakrid 2025: దేశ వ్యాప్తంగా బక్రీద్‌ను జరుపుకుంటున్న ముస్లిం సోదరులు

Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments