Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌కి సీక్రెట్‌గా కథ చెప్పిన డైరెక్టర్ ఎవరు..?

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (22:07 IST)
సూపర్ స్టార్ మహేష్‌ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ "సర్కారు వారి పాట". 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. అయితే... ఈ సినిమా తర్వాత మహేష్‌ చేయనున్న సినిమా ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే... 'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి మహేష్‌తో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. కానీ.. ఈ సినిమా స్టార్ట్ కావడానికి టైమ్ పడుతుంది.
 
అందుచేత రాజమౌళితో చేయనున్న మూవీ కన్నా ముందు మరో సినిమా చేయాలనుకుంటున్నారు. అందుకనే మహేష్ ఇప్పుడు కథలు వింటున్నారని టాక్. రీసెంట్‌గా సీక్రెట్‌గా ఓ కథ విన్నారట. ఇంతకీ మహేష్‌‌కి సీక్రెట్‌గా కథ చెప్పిన డైరెక్టర్ ఎవరంటే... అనిల్ రావిపూడి అని సమాచారం. 
 
'సరిలేరు నీకెవ్వరు' సినిమా తర్వాత మహేష్‌ - అనిల్ కలిసి మరో సినిమా చేయాలనుకున్నారు. అయితే.. కాస్త టైమ్ తీసుకుని సినిమా చేయాలనుకున్నారు. లాక్డౌన్ టైమ్‌లో టైమ్ దొరకడంతో అనిల్ కథ రెడీ చేసాడట. అనిల్ చెప్పిన కథకు మహేష్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. మరి.. ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో..? ఎవరు నిర్మిస్తారో క్లారిటీ రావాలంటే కొంత కాలం ఆగాల్సిందే. 

సంబంధిత వార్తలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments