Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబుకి ఆ ముగ్గురులో విలన్ ఎవరు..? (video)

Webdunia
గురువారం, 16 జులై 2020 (13:34 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ తర్వాత చాలా కథలు విని ఫైనల్‌గా గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పడం తెలిసిందే. ఈ క్రేజీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో మహేష్ సరసన క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ నటించనుంది. ఈ మూవీని అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు.
 
కరోనా లేకపోతే ఈపాటికే సెట్స్ పైకి వెళ్లేది. అయితే... షూటింగ్స్‌కి పర్మిషన్ ఇచ్చినా ఇప్పుడు షూటింగ్ చేయలేని పరిస్థితి. ఇదిలా ఉంటే... ఈ సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే... ఇందులో మహేష్‌ బాబుకి దీటుగా విలన్ పాత్ర ఉంటుందట. ఆ పాత్రను ఎవరు చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నారని తెలిసింది. 
 
అయితే.... కన్నడ నటులు ఉపేంద్ర, సుదీప్, అరవింద్ స్వామిలను సంప్రదిస్తున్నట్టు తెలిసింది. ఈ ముగ్గురిలో ఒకరిని ఈ మూవీలో విలన్ పాత్రకు ఎంపిక చేస్తారని అంటున్నారు. అయితే... ఇంతవరకు ఎవరినీ ఇంకా ఫైనల్ చేయలేదు. దీంతో ఈ క్రేజీ మూవీలో విలన్ పాత్రను పోషించే అవకాశం ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తిగా మారింది. మరి... ఉపేంద్ర, సుదీప్, అరవింద స్వామి.. ఈ ముగ్గురిలో ఎవర్ని సెలెక్ట్ చేస్తారో చూడాలి.

 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments