Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ - శంకర్ మూవీపై లేటెస్ట్ అబ్‌డేట్స్

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (12:25 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ప్రముఖ టాలీవుడ్ ఏసీ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే, ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చనున్నారనే వార్త గురువారం ఒకటి వెలువడింది. ఇపుడు మరో వార్త వినిపిస్తోంది. ఇందులో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం. 
 
ఈమె గతంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించింది. చరణ్‌తో ఆమె జోడీ బాగుందంటూ అభిమానులు ప్రశంసలు కూడా కురిపించారు. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకులను అలరించే అవకాశం కనిపిస్తోంది.
 
నిజానికి దిల్ రాజు నిర్మించే ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో కొరియన్ అందాల సుందరి సుజీబే కథానాయికగా నటిస్తుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, ఆమె స్థానంలో తాజాగా కియారా అద్వానీ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం దర్శక నిర్మాతలు కియారా కోసం  ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments