Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెర్రీ - శంకర్ కాంబో చిత్రానికి సంగీత దర్శకుడుగా ఏఆర్ రెహ్మాన్!

చెర్రీ - శంకర్ కాంబో చిత్రానికి సంగీత దర్శకుడుగా ఏఆర్ రెహ్మాన్!
, గురువారం, 11 మార్చి 2021 (13:08 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. అయితే, ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలు సమకూర్చనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
తాజాగా సోషల్‌మీడియా వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నకు రెహమాన్‌ ఇచ్చిన సమాధానం చూస్తే అవుననే అనిపిస్తోంది. ట్విటర్‌లో ఒక అభిమాని రెహమాన్‌ని ప్రశ్నిస్తూ ‘మీ నుంచి తెలుగు ఆల్బమ్‌ ఎప్పుడు వస్తుంది’ అని అడిగారు. అందుకు ‘త్వరలోనే’అని సమాధానమిచ్చిన రెహమాన్‌ స్మైలీ సింబల్‌ పోస్ట్‌ చేశారు.
 
ఇప్పుడీ ఈ ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. మామూలుగా శంకర్‌ డైరెక్ట్‌ చేసే చాలా చిత్రాలకు ఏఆర్‌ రెహమానే సంగీతం అందిస్తారు. ఇప్పుడీ ఈ సమాధానంతో శంకర్‌-చెర్రీల సినిమాకు కూడా ఆయనే సంగీతం అందిస్తారని టాక్‌ వినిపిస్తోంది. అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు. 
 
ఒకవేళ ఆయన్నే చిత్రబృందం నిర్ణయిస్తే రెహ్మా ప్రపంచ స్థాయి సంగీతంకు శంకర్‌ టేకింగ్‌కు రామ్‌చరణ్‌ పవర్‌ఫుల్‌ యాక్టింగ్‌‌తోడైతే వెండితెరపై పండగ వాతావరణమే. ప్రస్తుంత ఈ చిత్రానికి సంబంధిచంన స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం జరుగుతుండగా 2022లో ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"ఇస్మార్ట్ బ్యూటీ"కి లైఫ్ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్?