Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ సీక్వెల్ చిత్రంలో 'మహానటి'కి చాన్స్?? (video)

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (13:59 IST)
టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్‌కు మరో అరుదైన అవకాశం దక్కే ఛాన్స్ వచ్చింది. ప్రముఖ దర్శకుడు కె.భారతీరాజా దర్శకత్వంలో ఆమె నటించనుంది. గత 1978లో కమల్ హాసన్ - శ్రీదేవి జంటగా భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రం సిగప్పు రోజాక్కల్ (ఎర్రగులాబీలు). ఈ చిత్రానికి సీక్వెల్ తీయనున్నారు. ఈ ఏర్పాట్లలో భారతీరాజ తనయుడు మనోజ్ భారతీరాజా సన్నాహాలు చేస్తున్నారు. 
 
రోజాపూక్కళ్ చిత్రానికి ఇళయరాజా సంగీత బాణీలు సమకూర్చగా, విశ్వనటుడు కమల్‌హాసన్‌ సైకో పాత్రలో అద్భుతంగా నటించారు. ప్రస్తుతం ఆ చిత్రం సెకండ్‌ పార్ట్‌ తీయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. 
 
అందమైన అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసగించి వారి శవాలను ఇంటి వెనుక గార్డెన్‌లో పూడ్చిపెట్టే సైకో కథతో 'ఎర్ర‌గులాబీలు' చిత్రాన్ని రూపొందించారు. కాగా రెండోపార్ట్‌ కోసం అమ్మాయిలను ప్రేమపేరుతో వంచించే యువకులపై హీరోయిన్‌ కక్ష తీర్చుకునే విధంగా వెరైటీ కథను తయారు చేశారు. 
 
ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆమె కాల్షీట్లు దొరకకపోతే సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేస్తామని మనోజ్‌ తెలిపారు.ఈ చిత్రం వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Microsoft Campus : గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌‌ను రేవంత్ రెడ్డి (video)

మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్‌లో కొడాలి నాని పేరు.. అరెస్ట్ తప్పదా?

వల్లభనేని వంశీ భార్యను అడ్డుకున్న పోలీసులు... ఎస్కార్ట్‌తో తరలింపు (Video)

టెన్త్ జీపీఏ సాధించిన విద్యార్థులకు విమానంలో ప్రయాణించే అవకాశం

వర్క్ ఫ్రంమ్ హోం కాదు.. వర్క్ ఫ్రమ్ కారు : వీడియో వైరల్ - షాకిచ్చిన పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments