Webdunia - Bharat's app for daily news and videos

Install App

''కాష్మోరా'' ఫస్ట్ లుక్ రిలీజ్.. నయనతార, శ్రీదివ్య హీరోయిన్లు.. కార్తీ లుక్‌తో..

ఊపిరి చిత్రంతో మాంచి ఊపుమీదున్న తమిళ హీరో కార్తీ ప్రస్తుతం గోకుల్ దర్శకత్వంలో 'కాష్మోరా' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తీ మూడు విభిన్న పాత్రలను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తీ సరసన మలయా

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (11:49 IST)
''ఊపిరి'' చిత్రంతో మాంచి ఊపుమీదున్న తమిళ హీరో కార్తీ ప్రస్తుతం గోకుల్ దర్శకత్వంలో 'కాష్మోరా' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తీ మూడు విభిన్న పాత్రలను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తీ సరసన మలయాళ ముద్దుగుమ్మ నయనతార, తెలుగుమ్మాయి శ్రీదివ్యలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కూడా భారీ స్థాయిలో ఉందట. 
 
ఈ చిత్రానికి సంబంధించిన 15 నిమిషాల షూటింగ్‌ని త్రీడీ ఫేస్ స్కానింగ్ టెక్నాలజీ‌ని వాడి యూనిట్ సభ్యులు చిత్రీకరిస్తున్నారట. అలాగే మగధీర, ఈగ, బాహుబలి చిత్రాలకు గ్రాఫిక్స్ అందించిన మకుట సంస్థ ఈ చిత్రానికి గ్రాఫిక్స్ అందిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్, కొద్దిసేపటి క్రితం కార్తీ స్వయంగా విడుదల చేశారు. 
 
పూర్తిగా గుండు కొట్టించుకొని, ఓ యుద్ధ నేపథ్యంలో నడిచే కథలో సైనికాధికారిలా కనిపిస్తూ కార్తీ అందరినీ ఆశ్చర్యపరిచారు. పీవీపీ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్నఈ సినిమా ఫస్ట్‌లుక్ ఇలా విడుదలైందో లేదో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తోంది. కార్తీ చేసిన ప్రయత్నానికి అభిమానుల నుండి మంచి స్పందన లభిస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చెన్నైలో పవన్ ఒక్క నియోజకవర్గంలో పోటీ చేసి గెలిస్తే.. ఆయన చెప్పింది వింటాం..

ఇజ్రాయెల్ - ఇరాన్‌లు కాల్పుల విరమణ - దిగివచ్చిన క్రూడ్ ఆయిల్ ధరలు

మాజీ సీఎం జగన్‌పై మరో కేసు నమోదు

పెళ్లై నెల రోజులే: గద్వాలలో భర్తను చంపి అతడి మృతదేహంతో కారులో భార్య, ప్రియుడు (video)

Dogs diving at the Olympics: స్విమ్మింగ్ పూల్‌లో డైవ్ చేసి ఎంచక్కా దూకేస్తున్న శునకాలు (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments