Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబ‌లి-2లో సుదీప్ క‌ట్ట‌ప్ప‌కు ఛాన్స్ లేనట్టేనా?

బాహుబ‌లి ఫ‌స్ట్ పార్ట్‌లో కట్టప్ప కత్తిసాము ప్రతిభకు మైమరిచిపోయిన సుదీప్ (అస్లాం ఖాన్).. ఏ సహాయం కావాలన్నా ఈ స్నేహితుడు ఉన్నాడని మరిచిపోకు అంటూ కట్టప్పకు మాట ఇస్తాడు. ఈ సీన్ ఆ సినిమాలోనే హైలైట్ అని చె

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (11:42 IST)
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్ర‌స్తుతం ఈ సినిమాకు కొన‌సాగింపుగా బాహుబ‌లి-2 తెర‌కెక్కుతోంది. ఈ సినిమాని వేస‌వి కానుకగా రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఓ సూప‌ర్ ట్విస్ట్‌ను ఓ హీరో రివీల్ చేయ‌డం ఇప్పుడు టాలీవుడ్‌లో సంచ‌ల‌నంగా మారింది.
 
బాహుబ‌లి ఫ‌స్ట్ పార్ట్‌లో కట్టప్ప కత్తిసాము ప్రతిభకు మైమరిచిపోయిన సుదీప్ (అస్లాం ఖాన్).. ఏ సహాయం కావాలన్నా ఈ స్నేహితుడు ఉన్నాడని మరిచిపోకు అంటూ కట్టప్పకు మాట ఇస్తాడు. ఈ సీన్ ఆ సినిమాలోనే హైలైట్ అని చెప్పుకోవచ్చు. బాహుబ‌లి మొదటి పార్ట్‌లో క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ అయిన సుదీప్ ఫ‌ర్షియా రాజుగా ఆ సినిమాలో నటించాడు. దీంతో బాహుబ‌లి-2లో సుదీప్ క‌ట్ట‌ప్ప‌కు సెకండ్ పార్ట్‌లో నటించే అవకాశం ఉందని అభిమానులు అనుకున్నారు.
 
అయితే సుదీప్ తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బాహుబ‌లి 2 షూటింగ్‌కు సంబంధించి.. ఇంకా ఎవ‌రూ త‌న‌ను సంప్రదించలేదని అన్నారు. సుదీప్ సమాధానంతో అందరూ షాక్ తిన్నారు. బాహుబ‌లి సినిమాకు సంబంధించిన ప్రతి విష‌యంలో రాజ‌మౌళి స‌స్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు సుదీప్ ఇలా త‌న క్యారెక్ట‌ర్ గురించి ఓపెన్ అవ్వ‌డంపై రాజ‌మౌళి ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.50వేల అప్పు తీర్చేందుకు భార్యను అమ్మేశాడు.. స్నేహితుడితో అత్యాచారం చేయించాడు..

వ్యూస్ కోసం చీర చెంగుకి నిప్పంటించుకుని డ్యాన్స్ చేసిన మహిళ (video)

జూలై ఒకటో తేదీ నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు?

Ponnam: జూలై 13న బోనాలు.. ప్రజల సహకారం అవసరం.. పొన్నం ప్రభాకర్

ఎయిరిండియా విమానాల్లో అనేక లోపాలను గుర్తించిన డీజీసీఏ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments