ముగిసిన హనీమూన్... షూటింగులకు సిద్ధమంటున్న కాజల్

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (15:22 IST)
టాలీవుడ్ సీనియర్ నటి కాజల్ అగర్వాల్. గత నెల 30వ తేదీన వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత తన భర్తతో కలిసి మాల్దీవులకు హనీమూన్ కోసం వెళ్లారు. అక్కడ లక్షలాది రూపాయలు ఖర్చు చేసి, ఓ ప్రైవేట్ రిసార్ట్స్ తీసుకుని సముద్ర గర్భంలో హనీమూన్ చేసుకున్నారు. ఈ హనీమూన్‌కు సంబంధించిన ఫోటోలను ఆమె ఎప్పటికపుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చారు. అలా వారం రోజుల పాటు మాల్దీవుల్లో విహరించిన కాజల్.. ఇపుడు తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ముంబైకు చేరుకుంది. అంతేనా, తాను సంతకాలు చేసిన మూవీ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆమె సమాయత్తమవుతోంది. 
 
అందులోభాగంగా, మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్న "ఆచార్య" చిత్రం షూటింగ్‌లో పాల్గొనేందుకు పచ్చజెండా ఊపింది. కాగా, ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 20 తేదీ నుంచి ప్రారంభంకానుంది. నిజానికి ఈషూటింగ్ ఈ నెల 9వతేదీ నుంచే ప్రారంభంకావాల్సివుంది. అయితే, చిరంజీవికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత టెస్టింగ్ కిట్‌లో లోపం వల్ల చిరంజీవికి పాజిటివ్ అని వచ్చిందనీ, ప్రస్తుతం ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు తేలింది. దీంతో ఆచార్య షూటింగులో కూడా చిరంజీవి పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో కాజల్ కూడా వచ్చేందుకు సిద్ధమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

మా డాడీ పొలిటికల్ కెరీర్ చివరి దశలో ఉంది : సీఎం సిద్ధరామయ్య కుమారుడు

తునిలో బాలికపై లైంగిక వేధింపుల కేసు: ఆ వ్యక్తికి ఏ పార్టీతో సంబంధంలేదు, అలా రాస్తే చర్యలు (video)

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రచారం.. ఎవరి కోసం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments