Webdunia - Bharat's app for daily news and videos

Install App

Soundarya House: సౌందర్య ఇంటి కోసమే.. మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయా?

సెల్వి
మంగళవారం, 10 డిశెంబరు 2024 (14:40 IST)
Soundarya
మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆస్తి విషయంలో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని సమాచారం. ముఖ్యంగా మోహన్ బాబు మంచు మనోజ్ మౌనికలపై కేసు పెట్టడంతో పాటు మనోజ్ మౌనికలు తన ఇంట్లో దొంగతనం చేశారని, తన కొడుకు కోడలు తనపై దాడి చేశారని వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని వాట్సాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అయితే జల్ పల్లిలో మోహన్ బాబు కట్టుకున్న ఇంటి విషయంలోనే వీరి మధ్య ప్రధాన గొడవ జరిగినట్లు తెలుస్తోంది కానీ సౌందర్య ప్రాపర్టీ అని కూడా వార్తలు వచ్చాయి. సౌందర్య చనిపోయిన తర్వాత డబ్బు కోసం సౌందర్య కుటుంబ సభ్యులు ఆమె ఇంటిని మోహన్ బాబుకు అమ్మేశారని కొందరు అంటున్నారు.
 
ఇక మంచు ఫ్యామిలీలోని అందరి చూపు జల్ పల్లిలోని సౌందర్య నివాసంపైనే ఉందని, ఆ ఇంటి కోసం విష్ణు, మనోజ్, మోహన్ బాబు మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కానీ మనోజ్ జల్ పల్లి నివాసంలో ఉండాలనుకుంటున్నారు. 
 
కానీ మోహన్ బాబు తన ఇంట్లో దొంగతనం చేశాడని కొడుకుపై కేసు పెట్టారు. అందరి చూపు ఓకే ఇంటిపైనే ఉండడంతో ఈ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే విలాసవంతంగా నిర్మించిన ఈ ఇంటిని తన కుమారులకు ఇవ్వడం మోహన్ బాబుకు ఇష్టం లేదని తెలుస్తోంది. ఈ ఇంటి విలువ రూ.100 కోట్లు వుంటుందని అంచనా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

Air India: అహ్మదాబాద్-లండన్ విమానం రద్దు.. ఏమైందంటే?

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments