Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దర్శకుడు మోసం చేశాడంటున్న నయనతార...

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (13:39 IST)
అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఉన్న హీరోయిన్లలో నయనతార ఒకరు. ఈమె ఒకవైపు ప్రియుడుతో ప్రేమాయణం కొనసాగిస్తూనే, మరోవైపు వరుస చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "దర్బార్" చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి దర్శకుడు మురుగదాస్. ఈ చిత్రంలోని పాత్రపై ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. 
 
12 యేళ్ల క్రితం సూర్య నటించిన చిత్రం గజినీ. ఈ చిత్రంలో తనను మోసం చేసినట్టుగానే ఇపుడు కూడా దర్బార్ చిత్రంలో మరుగదాస్ మోసం చేశారంటూ బోరున విలపిస్తోంది. దర్బార్ చిత్రంలో మెయిన్ హీరోయిన్ నయనతార అయినప్పటికీ రజనీ కుమార్తెగా నటించిన నివాదే థామస్‌కు ఇచ్చిన విలువలో సగం కూడా తనకు ఇవ్వలేదని, తనను ఓ జూనియర్ ఆర్టిస్టుగా చూపించారని ఈమె వాపోతోంది. 
 
ముఖ్యంగా, ఇక నయనతార అభిమానులు సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో తన సత్తాను చాటి, కోట్లాది మంది అభిమానాన్ని పొందిన నయన్, అసలు ఇటువంటి సినిమాను ఎందుకు ఒప్పుకుందని ప్రశ్నిస్తున్న వారూ లేకపోలేదు. 
 
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేస్తున్న విమర్శలతో మరింత అశాంతికి గురవుతున్న నయన్, మురుగదాస్ 'గజినీ' సినిమాలో నటించి తప్పు చేసిన తాను, మరోసారి అతని సినిమాలో నటించేందుకు అంగీకరించి, తప్పు చేశానని, అందుకు ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నానని అంటోందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారి కళ్ళెదుటే ఉరివేసుకున్న వివాహిత.. భర్త, అత్తమామలపై కేసు

Pulasa: పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే- 800 గ్రాముల పులస రూ.22వేలు పలికింది

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

Andhra liquor scam: ఛార్జిషీట్‌లో జగన్ పేరు ఉన్నా.. నిందితుడిగా పేర్కొనలేదు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments