Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ దెబ్బ‌కు డీలాప‌డ్డ క్రిష్‌.. హిట్ కోసం ప‌క్కా ప్లాన్

Webdunia
సోమవారం, 6 మే 2019 (20:55 IST)
గ‌మ్యం సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క్రిష్‌. ఆ త‌ర్వాత వేదం, కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్, కంచె, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి.. ఇలా విభిన్న క‌థా చిత్రాల‌ను తెర‌కెక్కించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నాడు. అయితే... నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ‌ను ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హా నాయ‌కుడు అని రెండు పార్టులుగా తీయ‌డం తెలిసిందే.
 
ఈ సినిమా డిజాష్ట‌ర్ అయి షాక్ ఇచ్చింది. దీనికితోడు మ‌ణిక‌ర్ణిక సినిమా వివాదాస్ప‌దం కావ‌డంతో క్రిష్ బాగా డీలాప‌డ్డాడు. దీంతో క్రిష్ నెక్ట్స్ ఎలాంటి సినిమా చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. అయితే.. క్రిష్ తన తరవాత సినిమా తెలుగులో చేయడంలేదని టాక్. ఆయన మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లనున్నారని సమాచారం. 
 
కాగా ఇప్పటికే తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఠాగూర్’ సినిమాను హిందీలో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’గా తెరకెక్కించారు క్రిష్. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. 
 
తనకు బాలీవుడ్లో ఫ‌స్ట్ ఛాన్స్ ఇచ్చిన‌ అక్షయ్ కుమార్‌నే మళ్లీ క్రిష్ సంప్రదించారని అంటున్నారు. ఇప్పటికే అక్షయ్‌కు క్రిష్ కథ చెప్పారట. ఆయన కూడా సానుకూలంగానే ఉన్నారని సమాచారం. అయితే.. ఇంకా స్క్రిప్ట్‌ను ఫైనలైజ్ చేయలేదని అంటున్నారు. మొత్తానికి క్రిష్ తరువాత సినిమా బాలీవుడ్‌లో చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్త‌వం ఎంతో తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments