Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు సినిమాపై క్లారిటీ ఇచ్చిన బాబీ, ఇంతకీ సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

Webdunia
శనివారం, 23 మే 2020 (17:32 IST)
మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ తర్వాత స్పీడు పెంచి దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటివరకు నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే...  ఈ సినిమా తర్వాత వరుసగా మూడు సినిమాలకు ఓకే చెప్పినట్టు చిరంజీవి ఇటీవల ప్రకటించారు. అందులో సాహో డైరెక్టర్ సుజిత్‌తో ఓ సినిమా, వెంకీమామ డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో ఓ మూవీ, మెహర్ రమేష్‌ డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నట్టు చిరంజీవి తెలియచేసారు. అయితే... చిరంజీవితో చేయనున్న సినిమా గురించి ఫస్ట్ టైమ్ డైరెక్టర్ బాబీ స్పందించారు.
 
ఇంతకీ ఏం చెప్పారంటే... చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఈ సినిమా ఉంటుందన్నారు. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుందన్నారు. చిరంజీవి గారికి కథ చెప్పగానే.. వెంటనే ఈ సినిమా మనం చేద్దామన్నారు.

ఓ కొత్త తరహా కథతో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేలా ఈ సినిమాని తెరకెక్కిస్తానన్నారు బాబీ. ఈ మూవీని ఎవరు నిర్మించనున్నారు..? అనేది ఇంకా ఖరారు కాలేదు. అయితే.. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి కాస్త టైమ్ పడుతుంది. ఎప్పుడు స్టార్ట్ కానుంది..? ఎవరు నిర్మిస్తారు..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments