Webdunia - Bharat's app for daily news and videos

Install App

డియర్ దత్ గారూ... సినిమా సెట్స్‌పైకి వెళ్లాక చెక్కుతో రండి... దీపికా

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (16:24 IST)
టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రముఖ నిర్మాత సి. అశ్వినీదత్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. 'మహానటి' ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి దీపికా పదుకొనెను ఎంపిక చేశారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మించనున్నారు.
 
కరోనా మహమ్మారి కాస్త సద్దుమణిగిన తర్వాత ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దానికంటే ముందుగా ఈ చిత్రంలో ఎంపిక చేసిన నటీనటులకు అడ్వాన్సులను నిర్మాతలు అందజేస్తున్నారు. 
 
ఈ క్రమంలో హీరోయిన్ దీపకకు కూడా అడ్వాన్స్ చెక్ ఇచ్చేందుకు నిర్మాత అశ్వనీదత్ సంప్రదించారట. అయితే, ఆమె మాత్రం అడ్వాన్స్ తీసుకునేందుకు ససేమిరా అన్నదట. సినిమా సెట్స్ పైకి వెళ్లిన తర్వాతే అడ్వాన్స్ చెక్ తీసుకరండి అని చెప్పారట. 
 
దీనికి కారణం లేదు. ప్రస్తుతం పరిస్థితులు మునుపటిలా లేవు. కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగులు ఎపుడు మొదలవుతాయో తెలియని అయోమయ పరిస్థితినెలకొంది. ఇలాంటి సమయంలో ముందుగా అడ్వాన్సులు తీసుకుని నిర్మాతలను ఇబ్బంది పెట్టడం సబబు కాదని భావించిన దీపికా పదుకొనే ప్రస్తుతానికి అడ్వాన్స్ చెక్ వద్దని చెప్పారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments