Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫోర్ ప్లే ట్రైలర్ విడుదల... అదంతా తుచ్ఛమైనదని చెప్పాం

ఫోర్ ప్లే ట్రైలర్ విడుదల... అదంతా తుచ్ఛమైనదని చెప్పాం
, సోమవారం, 31 ఆగస్టు 2020 (14:23 IST)
ఆర్ పిక్చర్స్ బ్యానర్ పైన రాంబాబు మీడియా హౌస్ సమర్పణలో చిక్కవరపు రాంబాబు నిర్మాతగా పాలకుర్తి ప్రసాద్ అనే యువకుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ఫోర్ ప్లే. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్‌ని, చిత్ర యూనిట్ లాంచ్ చేసింది.
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చిక్కవరపు రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాలను తెలియజేశారు. ఈ సినిమా యొక్క ప్రధాన ఉద్దేశం.. "ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువత చిన్న చిన్న సంతోషాలకోసం ఎలా పెడదోవ పడుతున్నారో... ఇంటికి దీపం ఇల్లాలుగా ఉండాల్సిన మహిళలు అమాయకంగా తీసుకునే నిర్ణయాల వల్ల ఎలా బ్లాక్ మెయిలింగ్‌కు గురి అవుతున్నారో.. అలాకాకుండా డబ్బు, ఇతరత్రా విషయాలు జీవితంలో తుచ్ఛమైనవిగా భావించి.. ప్రేమించడం, ప్రేమించబడ్డ వ్యక్తితో నమ్మకంగా ఉండటం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంగా చెప్పడమే మా చిత్రం యొక్క ఉద్దేశం." అని తెలిపారు.
 
ఈ చిత్రంలో నటీనటులు- హీరో; శ్యామ్, హీరోయిన్; హరిణి, నటీనటులు; హారిక, శ్రీకాంత్, నితీన్, రహీమ్ సిద్దిపేట్, సురేష్, సాంకేతిక నిపుణులు- కెమెరా; రవి బైపల్లి, సంగీతం; శయక్ పార్వీజ్, ఆర్.ఆర్: శ్యామ్ కే ప్రసాన్, ఎడిటర్ ; జెమా, మాటలు; సుదర్శన్, ఆర్ట్; వాసు, మేకప్: కుమార్, గ్రాఫిక్; RGB స్టూడియోస్, డి.ఐ: ప్రభు పబ్లిసిటీ డిజైన్స్; రాంబాబు పోస్టర్ యాడ్స్, PRO; ఆనందం రాంబాబు, స్టిల్స్: కిషోర్, పొడక్షన్ మేనేజర్; ముజీబ్ బాషా, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పాలకుర్తి ప్రసాద్, సమర్పణ రాంబాబు మీడియా హౌస్, నిర్మాత చిక్కవరపు రాంబాబు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెండితెర ప్రాభవం ఇక ముగిసినట్టేనా? ఓటీటీ వైపు హీరోల మొగ్గు...