Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవికి టీడీపీ, వైకాపా ఆఫర్లే ఆఫర్లు.. కాంగ్రెస్‌కు హ్యాండిస్తారా? రాజకీయాలకు బై చెప్తారా?

తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజ్యసభలో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇరు రాష్ట్రాల్లో కా

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2017 (11:51 IST)
తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజ్యసభలో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అంత క్రేజ్ లేకపోవడంతో పాటు ఆ పార్టీ రాజకీయ భవితవ్యం చెప్పుకునే స్థాయిలో లేకపోవడంతో చిరంజీవి.. కాంగ్రెస్‌కు హ్యాండిచ్చేందుకు రెడీ అయినట్లు టాక్ వస్తోంది.
 
వచ్చే ఏడాదితో చిరంజీవి రాజ్యసభ సభ్యత్వానికి కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి రాజకీయ ప్రయాణం ఎలా సాగుతుందనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ సినిమాలతో బిజీ బిజీగా వున్నారు. మరోవైపు చిరంజీవి రాజ‌కీయాల‌కు పూర్తిగా వీడ్కోలు ప‌లుకుతారని కూడా చర్చ సాగుతోంది. అంతేగాకుండా కాంగ్రెస్ నుంచి చిరంజీవి పక్కకు తప్పుకుంటారని.. వివిధ పార్టీల నుంచి ఆయనకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. 
 
చిరంజీవిని మ‌ళ్లీ రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేస్తామ‌ని రాజ‌కీయ పార్టీలు ప్ర‌తిపాద‌న‌లు చేస్తున్నట్లు స‌మాచారం. ప్ర‌ధానంగా ఈ ఆఫ‌ర్లు ఇస్తున్న పార్టీల్లో టీడీపీ, వైసీపీ పార్టీలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక మొత్తం మీద చూసుకుంటే చిరంజీవిని తిరిగి రాజ్యసభకు నామినేట్ చేసే కెపాసిటీ కాంగ్రెస్ పార్టీకి లేదని సమాచారం. దీంతో చిరంజీవి ఆ పార్టీని వీడి తెలుగుదేశం లేదా వైకాపాలోకి జంప్ అవ్వాలని చూస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pen Cap in Lung: ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్.. 26 ఏళ్ల తర్వాత తొలగించిన వైద్యులు.. ఎక్కడ?

కర్ణాటకలో పరువు హత్య.. పూజారినే పెళ్లి చేసుకుంటానన్న కుమార్తెను చంపేసిన తండ్రి

Delivery Boy: డెలివరీ పర్సన్‌‌తో సహజీవనం చేసిన మైనర్ బాలిక.. తర్వాత ఏమైందంటే?

Raja Singh: నేను స్వతంత్ర ఎమ్మెల్యే... స్వేచ్ఛగా మాట్లాడగలను.. రాజా సింగ్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు - అక్టోబర్ వరకు రిజర్వ్‌లో తీర్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments