చిరు మరో మల్టీస్టారర్, మరో హీరో ఎవరో తెలుసా?

Webdunia
శనివారం, 9 మే 2020 (15:53 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఓ మల్టీస్టారర్. ఈ సినిమా తర్వాత మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ రీమేక్ లోనటించనున్నారు.
 
ఈ చిత్రానికి సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమా కూడా ఓ మల్టీస్టారరే. అయితే.. ఇప్పుడు తాజాగా మరో మల్టీస్టారర్లో కూడా చిరు నటించనున్నారని తెలిసింది. ఇంతకీ విషయం ఏంటంటే... లూసీఫర్ తర్వాత చిరంజీవి బాబీ డైరెక్షన్లో సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే ప్రకటించారు.
 
బాబీ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో ఫుల్ స్టోరీ రెడీ చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాబీ ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాడు. అయితే.. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో హీరో కూడా ఉన్నాడట. ఇంతకీ.. మరో హీరో ఎవరంటే దగ్గుబాటి రానా అని సమాచారం. 
 
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి - రానా కాంబినేషన్లో రూపొందే భారీ మల్టీస్టారర్ కథ చాలా కొత్తగా ఉంటుందని.. ప్రేక్షకులకు థ్రిల్ కలిగించేలా ఉంటుందని టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా, పాకిస్థాన్‌కు ఇక నిద్రలేని రాత్రులు- బ్రహ్మోస్‌ను పోలిన స్వదేశీ ఐటీసీఎం క్షిపణి రెడీ

భూమ్మీద నూకలున్నాయ్, తృటిలో తప్పించుకున్నాడు (video)

OG: పంజా తరహాలో 14 సంవత్సరాల తర్వాత పవన్ చేసే హైరేటెడ్ సినిమా ఓజీ?

Noida: స్పృహ తప్పి పడిపోయింది.. కొన్ని క్షణాల్లో మృతి.. నా బిడ్డకు ఏమైందని తల్లి?

అంతర్జాతీయ కోస్తా క్లీనప్ దినోత్సవం 2025: క్లీనప్ ఉద్యమానికి HCL ఫౌండేషన్ నేతృత్వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments