Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ క‌ళ్యాణ్-బాలయ్య చుట్టూ తిరుగుతున్న బోనీ కపూర్, ఎందుకు?

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (17:51 IST)
బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్... నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాడ‌ట‌. ఇంత‌కీ ఎవ‌రా ప్రొడ్యూస‌ర్ అనుకుంటున్నారా..? బోనీ క‌పూర్. అవును... ఇది నిజంగా నిజం. మేట‌ర్ ఏంటంటే... హిందీలో నిర్మించిన పింక్ సినిమా ఘ‌న విజ‌యం సాధించింది. ఈ సినిమా త‌మిళ్‌లో అజిత్ తో రీమేక్ చేస్తే... అక్క‌డ కూడా స‌క్స‌స్ అయ్యింది. దీంతో ఇప్పుడు దీనిని తెలుగులో రీమేక్ చేయాల‌నుకుంటున్నారు.
 
నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ ప్ర‌స్తుతం త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సి.క‌ళ్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల విదేశాల్లో షూటింగ్ జ‌రుపుకున్న ఈ సినిమా అక్టోబ‌ర్ 5 నుంచి హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకోనుంది. 
 
ఇదిలాఉంటే... పింక్ తెలుగు రీమేక్ రైట్స్ బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ బోనీక‌పూర్ ద‌గ్గ‌ర ఉన్నాయి. తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు బాల‌య్య‌ను సంప్ర‌దించార‌ట‌. అయితే... బాల‌య్య ఇంకా త‌న నిర్ణ‌యం చెప్ప‌లేద‌ట‌. 
 
రీసెంట్‌గా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఈ రీమేక్‌లో న‌టించ‌మ‌ని సంప్ర‌దించార‌ట‌. అయితే... ప‌వ‌న్ పాజిటివ్‌గానే స్పందించార‌ట కానీ... ఇంకా ఏ విష‌యం చెప్ప‌లేద‌ట‌. దీంతో పింక్ తెలుగు రీమేక్‌లో ఎవ‌రు న‌టించ‌నున్నారు అనేది ఆస‌క్తిగా మారింది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments