Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మధ్య చెడిందా..?

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (13:30 IST)
అల.. వైకుంఠపురములో సినిమా తర్వాత మాటల మాంత్రికుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకున్నారు. ఈ సినిమాని అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు. అయితే... కరోనా కారణంగా షూటింగ్స్ ఆగిపోవడం... ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో ఎన్టీఆర్‌తో మూవీ ఆలస్యం అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు.
 
ఇదిలా ఉంటే... మహేష్ బాబు త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. వీరిద్దరి మధ్య కథా చర్చలు జరగడం.. త్రివిక్రమ్ చెప్పిన స్టోరీకి మహేష్‌ ఓకే చెప్పడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
 
 అయితే... త్రివిక్రమ్ ఇలా మహేష్‌ బాబుతో సినిమా చేయాలనుకోవడంతో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత కేజీఎఫ్‌ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.
 
ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఎన్టీఆర్ - త్రివిక్రమ్‌కు చెడిందా..? అంటూ అనుమానాలు మొదలయ్యాయి. ప్రశాంత్ నీల్‌తో సినిమా చేసిన తర్వాత త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. కాస్త లేట్ అయినా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని అంటున్నారు. 
 
మరో విషయం ఏంటంటే... ఈ సినిమాలో ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్‌గా నటించనున్నారని.. దీనిని పాన్ ఇండియా మూవీగా రూపొందించనున్నారని సమాచారం.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments