Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌ బాబు మూవీలో విజయ్ హీరోయిన్

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (17:20 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రానికి గీత గోవిందం సినిమాతో బ్లాక్‌బస్టర్ సాధించిన టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత చాలా కథలు విని ఆఖరికి మహేష్ బాబు పరశురామ్ చెప్పిన కథకు ఓకే చెప్పారు.
 
కరోనా రాకపోతే ఈపాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి. కరోనా తగ్గే వరకు షూటింగ్‌కి రాలేనని మహేష్ చెప్పడంతో ఎప్పటి నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుందో చెప్పలేని పరిస్థితి.
 
 ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటించనుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కియారా కాదు.. కీర్తి సురేష్ నటించనున్నట్టు టాక్ వచ్చింది. కీర్తి సురేష్‌ నటించడం అనేది దాదాపు ఖాయం అని టాక్.
 
ఇదిలా ఉంటే.. ఇందులో మరో కథానాయిక పాత్ర కూడా ఉందట. ఆ పాత్రకు బాలీవుడ్ భామ.. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న అనన్య పాండే అయితే కరెక్ట్ ఉంటుందని అనుకుంటున్నారట. పరశురామ్ ఫుల్ స్రిప్ట్ రెడీ చేసి మహేష్ ఎప్పుడంటే అప్పుడు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీగా ఉన్నాడు. అనన్య పాండేకు ఈ మూవీలో నటించే అవకాశం వస్తే... లక్కీ ఛాన్స్ సొంతం చేసుకున్నట్టే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments