మన్మథుడు2లో అమల.. నాగ్ సరసన నటిస్తుందా?

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (14:33 IST)
2002లో విడుదలైన మన్మథుడు సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున ఖాతాలో హిట్ పడింది. ఈ సినిమా తర్వాత నాగార్జునను టాలీవుడ్ మన్మథుడు అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో మన్మథుడు అనే మూవీ తెరకెక్కగా ఇందులో నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు ప్రధాన పాత్రలు పోషించారు.
 
ఈ చిత్రానికి ఇప్పడు టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ మరియు మాటలు అందించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రానుంది. ఇందులో నాగార్జున హీరోగా నటిస్తుండగా, నాగ్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తోంది. మరో కథానాయిక కోసం చిత్ర యూనిట్ ఎంపిక చేసే పనిలో వుంది. 
 
ఈ నేపథ్యంలో సినిమాలో నాగార్జున సతీమణి, సినీ నటి అమల అతిథి పాత్రలో కనిపించనుందట. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరిగిపోతున్నాయి. 
 
నాగార్జునతో వివాహమైన తరువాత అమల సినిమాలకు దూరంగా వున్నారు. ఆ మధ్య వచ్చిన ''లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'' సినిమాలో ఆమె తల్లిపాత్రలో మెప్పించారు. ఆ తరువాత మనం సినిమాలో గెస్ట్ రోల్లో మెరిశారు. ఇప్పుడు మన్మథుడు2లో ఒక అతిథి పాత్రలో ఆమె కనిపించనున్నట్టు చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీలో మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు, విడాకులు జరగవు.. నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తాం.. సీఎం చంద్రబాబు

Woman: దిండుక్కల్‌‍లో ఘోరం.. బస్సు నుంచి కిందపడిన మహిళ మృతి (video)

Telugu Love: అబ్బా.. ఎంత బాగా తెలుగు మాట్లాడారు.. కృతికా శుక్లాపై పవన్ ప్రశంసలు

ఏలూరు: అర్థరాత్రి తలుపులు పగలగొట్టి యువతిపై ఇద్దరు రౌడీషీటర్లు అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments