Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్‌కి షాక్ ఇచ్చిన అల్లు అర‌వింద్... రంగంలోకి దిగిన నాగార్జున‌..!

Webdunia
సోమవారం, 6 మే 2019 (19:38 IST)
అక్కినేని అఖిల్ హీరోగా ఫ‌స్ట్ మూవీ రాకముందే సూప‌ర్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తీరా అఖిల్ ఫ‌స్ట్ మూవీ రిలీజ్ అయిన త‌ర్వాత అంద‌రూ షాక్ అయ్యారు. ఎందుకంటే... ఫ‌స్ట్ సినిమాతోనే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడనుకుంటే... ఇలా జ‌రిగింది ఏంట‌ని..! రెండో సినిమా హ‌లో కూడా అదే ప‌రిస్థితి. ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. ఇటీవ‌ల రిలీజైన మిస్ట‌ర్ మ‌జ్ను సినిమా కూడా ఫ్లాప్ అవ్వ‌డంతో నాలుగవ సినిమా పైనే ఆశ‌లు పెట్టుకున్నారు.
 
అఖిల్ నాలుగ‌వ సినిమాని అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. వ‌చ్చే నెల‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. అయితే... ఈ సినిమా బ‌డ్జెట్ ఎక్కువు అవుతుంది. అఖిల్ పైన అంత బ‌డ్జెట్ పెట్ట‌డం క‌రెక్ట్ కాదు అని చెప్పి  అల్లు అర‌వింద్ బ‌డ్జెట్ విష‌యంలో బాగా బేరాలు ఆడుతున్నార‌ట‌. 
 
ఈ విష‌యం అఖిల్ ద్వారా నాగార్జున తెలుసుకుని రంగంలోకి దిగార‌ట‌. క‌థ‌కు ఏం కావాలో అది చేయండి. బ‌డ్జెట్ గురించి అస‌లు ఆలోచించ‌ద్దు. అవ‌స‌ర‌మైతే ఎంత కావాలంటే అంత నేను ఇస్తాను అంటూ నాగార్జున ముందుకు వ‌చ్చార‌ట‌. దీంతో ఈ సినిమాని మంచి క్వాలిటీతో నిర్మించేందుకు రంగం రెడీ అయ్యింద‌ని స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments