Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్న అకీరా నందన్

ఠాగూర్
సోమవారం, 21 అక్టోబరు 2024 (08:14 IST)
తన తండ్రి, సినీ హీరో పవన్ కళ్యాణ్‌తో కలిసి తనయుడు అకీరా నందన్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. పవన్ హీరోగా ఓజీ అనే పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది. సుజిత్ దర్శకుడు. ముంబై నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ మూవీగా రూపొందిస్తున్నారు. గతయేడాది రిలీజైన గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ సినిమా గురించి మరోమారు ఓ క్రీజీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతుంది. 
 
ఓజీలో పవన తనయుడు అకీరా నందన్ నటించనున్నట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్​కి పూనకాలు రావడం ఖాయం. ఎందుకంటే పవన్​ను స్క్రీన్​పై చూసి అభిమానులు పూనకం వచ్చినట్లు కేరింతలు కొడతారు. అలాంటిది పవన్‌, ఆయన కుమారుడు అకీరా నందన్​ ఒకే సినిమాలో కనిపిస్తే అభిమానుల హంగామా మరో స్థాయిలో ఉండటం ఖాయం. 
 
అయితే ఓజీలో అకీరా నందన్ పవన్ చిన్నప్పటి పాత్రను చేస్తారని సోషల్ మీడియా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పవన్​కు డైరెక్టర్ సుజీత్ అకీరా పాత్ర గురించి చెప్పారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరికొందరు ఓజీలో అకీరా గెస్ట్ రోల్ లేదా ప్రత్యేకమైన పాత్ర చేస్తారని అంటున్నారు. ఒకవేళ పవన్ ఓజీలో అకీరా నటిస్తే అదే అతడి డెబ్యూ మూవీ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలక్ బాబా నాకు మత్తు మందు తినిపించి అత్యాచారానికి పాల్పడ్డాడు: యువతి ఆరోపణ

చికెన్ బిర్యానీలో కప్ప ... షాకైన విద్యార్థులు

తెనాలిలో నర్సును కారులో తీసుకెళ్లిన రౌడీ షీటర్, తెల్లారేసరికి ఆమె బ్రెయిన్ డెడ్

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫెర్టిలిటీ ఆవిష్కరణలపై ఫెర్టిజ్ఞాన్ సదస్సు కోసం తిరుపతిలో సమావేశమైన 130 మంది నిపుణులు

కాఫీలో నెయ్యి వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ఖర్జూరం పాలుని పవర్ బూస్టర్ అని ఎందుకు అంటారు?

జీరా వాటర్ ఎందుకు తాగాలో తెలుసా?

గుండెలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా చేయాల్సినవి ఏమిటి?

తర్వాతి కథనం
Show comments