పవన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్న అకీరా నందన్

ఠాగూర్
సోమవారం, 21 అక్టోబరు 2024 (08:14 IST)
తన తండ్రి, సినీ హీరో పవన్ కళ్యాణ్‌తో కలిసి తనయుడు అకీరా నందన్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. పవన్ హీరోగా ఓజీ అనే పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది. సుజిత్ దర్శకుడు. ముంబై నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ మూవీగా రూపొందిస్తున్నారు. గతయేడాది రిలీజైన గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ సినిమా గురించి మరోమారు ఓ క్రీజీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతుంది. 
 
ఓజీలో పవన తనయుడు అకీరా నందన్ నటించనున్నట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్​కి పూనకాలు రావడం ఖాయం. ఎందుకంటే పవన్​ను స్క్రీన్​పై చూసి అభిమానులు పూనకం వచ్చినట్లు కేరింతలు కొడతారు. అలాంటిది పవన్‌, ఆయన కుమారుడు అకీరా నందన్​ ఒకే సినిమాలో కనిపిస్తే అభిమానుల హంగామా మరో స్థాయిలో ఉండటం ఖాయం. 
 
అయితే ఓజీలో అకీరా నందన్ పవన్ చిన్నప్పటి పాత్రను చేస్తారని సోషల్ మీడియా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పవన్​కు డైరెక్టర్ సుజీత్ అకీరా పాత్ర గురించి చెప్పారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరికొందరు ఓజీలో అకీరా గెస్ట్ రోల్ లేదా ప్రత్యేకమైన పాత్ర చేస్తారని అంటున్నారు. ఒకవేళ పవన్ ఓజీలో అకీరా నటిస్తే అదే అతడి డెబ్యూ మూవీ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments