Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రాజుని రంగంలోకి దింపిన అల్లు అరవింద్

Webdunia
శనివారం, 11 జులై 2020 (19:58 IST)
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. ఆహో అంటూ ఓటీటీ ఫ్లాట్ఫామ్ స్టార్ట్ చేయడం తెలిసిందే. దీనిని సక్సెస్ చేయడం కోసం అల్లు అరవింద్ సక్సస్‌ఫుల్ డైరెక్టర్స్‌ని రంగంలోకి దించారు. వంశీ పైడిపల్లి, క్రిష్, అనిల్ రావిపూడి.. ఇలా కొంతమంది దర్శకులు ఆహా కోసం వర్క్ చేస్తున్నారు. ఇటీవల మిల్కీబ్యూటీ తమన్నాతో ఓ షో ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. 
 
తాజాగా ఆహా గురించి మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అది ఏంటంటే... అల్లు అరవింద్ దిల్ రాజుని రంగంలోకి దింపారట. ఆహా కోసం మంచి కంటెంట్ సెలెక్ట్ చేసే బాధ్యతను దిల్ రాజుకి అప్పగించారని సమాచారం.
 
 అంతేకాకుండా.. ఓ వైపు ఆహా కోసం కంటెంట్ సెలెక్షన్ చేస్తూనే మరోవైపు ఆహా కోసం తను కూడా వెబ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయనున్నట్టు తెలిసింది. ఆల్రెడీ కొన్ని స్టోరీలు విని ఓకే చేసినట్టు టాక్.
 
ఎంతమంది దర్శకులను పెట్టుకున్నప్పటికీ.. ఆహాకి ఆశించిన స్ధాయిలో స్పందన రావడం లేదు. ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తుంది. దీంతో దిల్ రాజుని రంగంలోకి దింపితే వర్కవుట్ అవుతుందనే ఉద్దేశ్యంతో అల్లు అరవింద్ ఇలా ప్లాన్ చేసారు. మరి.. ఈసారైనా అల్లు అరవింద్ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments