Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యతో రొమాన్స్ చేయనున్న జాన్వీ కపూర్

సెల్వి
గురువారం, 1 ఫిబ్రవరి 2024 (17:08 IST)
దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంటోంది. ఈ సినిమా దేవరగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అందరూ భావిస్తున్నారు. 
 
జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతోందని సినీ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం ప్రకాష్ తమిళంలో సూర్య కథానాయకుడిగా ఓ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. ఇందులో కథానాయికగా జాన్వీ కపూర్‌ని ఎంపిక చేశారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుంది కాబట్టి జాన్వీని కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. 
 
ఈ వార్త జాన్వీ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. ఈ చిత్రంలో ఆమె కథానాయికగా కనిపించనుంది. అదే సమయంలో రంగ్ దే బసంతి వంటి చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దీనికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇది మహాభారతం ఆధారంగా పాన్ ఇండియా చిత్రం, ఇది రెండు భాగాలుగా రూపొందించబడుతుంది. ప్రస్తుతం సూర్య ‘కంగువ’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments