Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజా ప్రస్థానం పాదయాత్ర.. నా జీవితం తెలంగాణకే అంకితం.. షర్మిల

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (21:49 IST)
తన జీవితం తెలంగాణకే అంకితమని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూలి నాలి చేసి చదివిస్తే పిల్లలకు ఉద్యోగాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
వరి వేసుకుంటే ఉరి అని కేసీఆర్ అంటున్నారని అన్నారు. ఏది పండించాలనే హక్కు రైతుకు లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. వ్యవసాయంలో అన్ని పథకాలు తీసేసి రూ.5 వేలు ఇస్తున్నారని అన్నారు.
 
వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పాదయాత్ర రెండోరోజు ముగిసింది. శంషాబాద్ మండలం క్యాచారం వరకు పాదయాత్ర సాగింది. అక్కడే క్యాచారంలో వైఎస్ షర్మిల బస చేయనున్నారు. నేడు 12 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేశారు. 
 
మొయినాబాద్ మండలం నక్కలపల్లి నుంచి క్యాచారం వరకు సాగిన పాదయాత్రకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఇప్పటి వరకు 24 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగింది. రేపు ఉదయం 10 గంటలకు శంషాబాద్ మండలంలో తిరిగి పాదయాత్ర ప్రారంభం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments