Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో కరోనా కేసులు.. వృద్ధ జంట వళ్లే కోవిడ్ వ్యాపించిందా?

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (21:22 IST)
కరోనా పుట్టిల్లు చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నట్టు ప్రకటించింది చైనా. అక్కడి అధికారులు వందలాది విమానాలు రద్దు చేశారు. స్కూల్స్ మూసివేశారు. కోవిడ్ పరీక్షల వేగాన్ని పెంచి.. గురువారం భారీగా పర్యాటకులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కొన్ని ఇతర దేశాల్లో కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ అవి తాత్కాలికంగా పరిమితులను తగ్గిస్తున్నాయి.
 
కానీ, చైనా మాత్రం దేశీయంగా అన్నిటినీ మూసివేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సరిహద్దులను మూసివేయడంతో కరోనా విషయంలో చైనా చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరో బాంబు చైనా పేలుస్తుందా అనే అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి.
 
అధికారులు చెబుతున్నదాని ప్రకారం చైనా వరుసగా ఐదవ రోజు కొత్త కేసులను నమోదు చేసింది. ఎక్కువగా ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి ఉంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తికి కారణంగా పర్యాటకులను పేర్కొంటున్నారు. 
 
జియాన్, గన్సు ప్రావిన్స్ అదేవిధంగా ఇన్నర్ మంగోలియా వెళ్ళే ముందు ఒక వృద్ధ జంట షాంఘైలో పర్యటించారు. రాజధాని బీజింగ్‌తో సహా కనీసం ఐదు ప్రావిన్సులు.. ప్రాంతాలలో సన్నిహిత పరిచయాలతో డజన్ల కొద్దీ కేసులు వారి ప్రయాణంతో ముడిపడి ఉన్నాయి. 
 
వారి ద్వారా కరోనా వ్యాప్తి చెందిందని అధికారులు చెబుతున్నారు. దీంతో విమాన సర్వీసులు రద్దు చేయడమే కాకుండా.. పర్యాటకులను పూర్తిగా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. వారిపై ఆంక్షలు విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments