తన బరువుకు సమానమైన బంగారం మొక్కు చెల్లించుకున్న వైఎస్.షర్మిల

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (15:40 IST)
వైఎస్ఆర్ తెలంగాణా పార్టీ అధినేత్రి వైఎస్.షర్మిల మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మొక్కులు చెల్లించుకున్నారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతికెక్కిన సమ్మక్క సారలమ్మ జాతర త్వరలో జరుగనుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర పండుగల్లో మేడారం జాతర ఒకటి. 
 
అయితే, ఈ జాతరకు ముందుగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ ఆలయాన్ని సందర్శించి తమ మొక్కులను తీర్చుకుంటారు. తాజాగా వైఎస్‌ షర్మిల మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని సందర్శించి గిరిజనుల దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సమ్మక్క, సారలమ్మలకు బంగారం (బెల్లం) సమర్పించింది. 
 
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ను కోరిన ఆమె గిరిజనుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్‌కు సమయం సరిపోవడం లేదని విమర్శించారు. 
 
సమ్మక్క, సారలమ్మ గొప్పతనాన్ని కొనియాడిన వైఎస్ షర్మిల.. మేడారం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వందల కోట్ల రూపాయలను మంజూరు చేశారని గుర్తు చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఏం చేశారంటూ ఆమె ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments