Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునుగోడు బరిలో వైఎస్ఆర్టీపీ అభ్యర్థి?

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (12:01 IST)
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని బరిలోకి దించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల నిర్ణయించారు. ఇందుకోసం ఆమె నలుగురు పేర్లను పరిశీలించారు. వారిలో ఒకరి పేరును అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో తన తండ్రి వైఎస్ఆర్ పాలన ఓట్లు తెచ్చిపెడుతుందని గట్టిగా భావిస్తున్నారు. అంతేకాకుండా, ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్ పాలనను గుర్తు చేస్తూ ఓట్లు అడగాలన్న ప్రణాళికతో ఈ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. 
 
కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా వచ్చిన శాసనసభ సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. దీంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని అన్ని పార్టీలు ఆరాటపడుతున్నాయి. ముఖ్యంగా, అధికార తెరాస, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ ఉప ఎన్నిక ఒక అగ్నిపరీక్షలా మారడంతో ఈ ఎన్నికను ఈ మూడు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 
 
అదేసమయంలో ఈ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని కూడా పోటీకి దింపి తమ సత్తా ఏంటో చాటాలన్న గట్టి పట్టుదలతో వైఎస్ షర్మిల కూడా ఉన్నారు. దీంతో పార్టీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించాలన్న విషయంపై ఇప్పటికే ఆమె కసరత్తు పూర్తి చేసి నలుగురి పేర్లను ఖరారు చేసినట్టు సమాచారం. వీరిలో ఒకరి పేరును ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అధికారింగా వెల్లడించనున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments