నిరుద్యోగులకు కొండత అండగా ఉంటాం : వైఎస్.షర్మిల

Webdunia
ఆదివారం, 11 జులై 2021 (14:40 IST)
తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ పుత్రిక వైఎస్. షర్మిల.. వైఎస్ఆర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆ రాష్ట్ర నిరుద్యోగులకు ఓ హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కొండంత అండగా ఉంటామని ప్రకటించారు  
 
నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువతకు భరోసా కల్పించేందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ తెలిపారు.
 
శనివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్‌టీపీ అడహక్‌ కమిటీ సభ్యులు పిట్టా రాంరెడ్డి, భూమిరెడ్డి, సాహితీ, ఆయూబ్‌ ఖాన్, కృష్ణమోహన్‌ తదితరులతో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ యువత కోసం ఏప్రిల్‌ నెలలో షర్మిల 72 గంటల పాటు దీక్ష చేసినప్పటికీ ప్రభుత్వంలో స్పందన లేకపోవడం దారుణమన్నారు.
 
టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఎన్నికల సమయంలోనే వరాలు కురిపించే సంస్కృతిని మానుకుని, బాధ్యతతో ఉద్యోగ నోటిఫికేషన్‌ క్యాలెండర్ రూపొందించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్ సర్కారులో చలనం వచ్చి ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేసేవరకు షర్మిల ప్రతి మంగళవారం దీక్ష చేపడతారని వైఎస్ఆర్‌టీపీ వర్గాలు తెలిపాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments